50 ఏళ్లు నిండిన భవన నిర్మాణ కార్మికులకు పింఛన్ ఇవ్వాలి.
50 ఏళ్లు నిండిన భవన నిర్మాణ కార్మికులకు పింఛన్ ఇవ్వాలి.
Alpha Raw
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.
రామన్నపేట,
భవన నిర్మాణ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రామన్నపేటలోని సీఐటీయూ మండల కార్యాలయంలో భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సంఘం జిల్లా కార్యదర్శి గొరిగే సోములు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా అందాల్సిన సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావడం లేదని, పెండింగ్లో ఉన్న క్లెయిమ్లను వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రమాద బీమా, పింఛన్, ప్రసూతి సహాయం, పిల్లల విద్యా సహాయం వంటి సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే 50 సంవత్సరాలు నిండిన భవన నిర్మాణ కార్మికులకు పింఛన్ మంజూరు చేయాలని, గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియను సులభతరం చేయాలని కోరారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడంతో పాటు పనిలో ప్రమాదాలు జరిగినప్పుడు బాధిత కుటుంబాలకు తగిన పరిహారం అందించాలని అన్నారు.
ప్రభుత్వం కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో కార్మిక సంఘం మండల అధ్యక్షుడు వంగాల మారయ్య, కార్యదర్శి బుడ్డ ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షుడు గాదె కృష్ణ, నాయకులు నూనె అంజయ్య, జింక కుమార్, జుంపాల మహేష్, మేడి కిరణ్, చెరుకు కిరణ్, బుడ్డ శ్రీకాంత్, కక్కిరేణి రాము, కోయపురి బిక్షం, కొల్లూరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి