Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
50 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలి. “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 02:21 PM

నీర్నంలలో ముందస్తు చర్యలు. మంచినీటి బోరు మరమ్మతు. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా: సర్పంచ్ గోపాల్ రెడ్డి

నీర్నంలలో ముందస్తు చర్యలు. మంచినీటి బోరు మరమ్మతు. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా: సర్పంచ్ గోపాల్ రెడ్డి

నీర్నంలలో ముందస్తు చర్యలు.  మంచినీటి బోరు మరమ్మతు.  ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా: సర్పంచ్ గోపాల్ రెడ్డి
25-05-2026 199 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎండాకాలంలో గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా నీర్నంల గ్రామపంచాయతీ ముందస్తు చర్యలు చేపట్టింది. గ్రామంలోని గోగు పాపులు బావి వద్ద ఉన్న గ్రామపంచాయతీ మంచినీటి బోరును మరమ్మతు చేయించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. గ్రామంలో తాగునీటి సమస్యతో పాటు సాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ప్రజలకు మౌలిక వసతులు మెరుగుపరచడం, తాగునీటి సరఫరా నిరంతరాయంగా కొనసాగించడం కోసం గ్రామపంచాయతీ కృషి చేస్తోందన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గంగుల వెంకటరెడ్డి, ఉపసర్పంచ్ ఆవుల శ్రీశైలం యాదవ్, గ్రామపంచాయతీ సిబ్బంది ముత్యాల సాయిలు, గ్రామస్థులు ఆవుల లక్ష్మీనారాయణ, గోగు పాపులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నీర్నంలలో ముందస్తు చర్యలు. మంచినీటి బోరు మరమ్మతు. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా: సర్పంచ్ గోపాల్ రెడ్డి

Article Image

ఎండాకాలంలో గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా నీర్నంల గ్రామపంచాయతీ ముందస్తు చర్యలు చేపట్టింది. గ్రామంలోని గోగు పాపులు బావి వద్ద ఉన్న గ్రామపంచాయతీ మంచినీటి బోరును మరమ్మతు చేయించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. గ్రామంలో తాగునీటి సమస్యతో పాటు సాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ప్రజలకు మౌలిక వసతులు మెరుగుపరచడం, తాగునీటి సరఫరా నిరంతరాయంగా కొనసాగించడం కోసం గ్రామపంచాయతీ కృషి చేస్తోందన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గంగుల వెంకటరెడ్డి, ఉపసర్పంచ్ ఆవుల శ్రీశైలం యాదవ్, గ్రామపంచాయతీ సిబ్బంది ముత్యాల సాయిలు, గ్రామస్థులు ఆవుల లక్ష్మీనారాయణ, గోగు పాపులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News