దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని. వినతి
దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని. వినతి
Editor Desk
భువనగిరి: దివ్యాంగులకు ఉద్యోగ రిజర్వేషన్లు, హక్కులు, రక్షణ కల్పించాలని కోరుతూ ‘ఉదయ్’ కమిటీ సభ్యులు శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, జిల్లా స్త్రీ–శిశు సంక్షేమ శాఖ అధికారి నర్సింహారావులను కలిసి వినతిపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఉదయ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. శ్రీనివాసులు మాట్లాడుతూ.. బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, ఔట్సోర్సింగ్ ఉద్యోగాల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. ప్రైవేటు సంస్థల సీఎస్ఆర్ నిధులను దివ్యాంగుల స్వయం ఉపాధికి వినియోగించాలని విజ్ఞప్తి చేశారు.
సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు భవనాల్లో ర్యాంపులు, లిఫ్టులు ఏర్పాటు చేయాలని, దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి వారం ప్రత్యేక ప్రజావాణి నిర్వహించాలని కోరారు.
కార్యక్రమంలో కుమార్ మల్లు, అంజిగౌడ్, వెంకట్రెడ్డి, జి. స్వామి, ఎస్. వెంకటేష్, ఏ. గోపాల్, ఆర్. వెంకటేష్, సత్యనారాయణ, మహేష్, రాజేష్, మల్లారెడ్డి, సిద్దార్థ్ నాయక్, సీహెచ్ శివ, సాయి కుమార్, బాలరాజు, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి