Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:09 AM

బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ

బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ

బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ
26-05-2026 168 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

అనారోగ్య బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.. ధైర్యం చెప్పి భరోసా

నార్కెట్‌పల్లి మండలం ఔరవని గ్రామానికి చెందిన నిరుడు మురళీధర్ రెడ్డి అనారోగ్యంతో ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య మంగళవారం వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. అవసరమైన వైద్య సహాయం అందించాలని కుటుంబ సభ్యులకు సూచించారు.

అలాగే చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డుకు చెందిన మహమ్మద్ గౌస్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా ఆయనను కూడా చిరుమర్తి లింగయ్య పరామర్శించారు. ప్రమాద వివరాలు తెలుసుకుని ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని సూచిస్తూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఇదే సందర్భంగా చిట్యాల మున్సిపాలిటీ 10వ వార్డుకు చెందిన గండమళ్ళ శంకర్ అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి వద్ద చికిత్స పొందుతుండగా వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని మనోధైర్యం కోల్పోవద్దని సూచించారు.

ప్రజల కష్టసుఖాల్లో అండగా ఉంటానన్న చిరుమర్తి లింగయ్య.

Sthanikam

బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ

Article Image

అనారోగ్య బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.. ధైర్యం చెప్పి భరోసా

నార్కెట్‌పల్లి మండలం ఔరవని గ్రామానికి చెందిన నిరుడు మురళీధర్ రెడ్డి అనారోగ్యంతో ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య మంగళవారం వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. అవసరమైన వైద్య సహాయం అందించాలని కుటుంబ సభ్యులకు సూచించారు.

అలాగే చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డుకు చెందిన మహమ్మద్ గౌస్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా ఆయనను కూడా చిరుమర్తి లింగయ్య పరామర్శించారు. ప్రమాద వివరాలు తెలుసుకుని ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని సూచిస్తూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఇదే సందర్భంగా చిట్యాల మున్సిపాలిటీ 10వ వార్డుకు చెందిన గండమళ్ళ శంకర్ అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి వద్ద చికిత్స పొందుతుండగా వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని మనోధైర్యం కోల్పోవద్దని సూచించారు.

ప్రజల కష్టసుఖాల్లో అండగా ఉంటానన్న చిరుమర్తి లింగయ్య.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News