బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ
Komidala Mahender reddy
అనారోగ్య బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.. ధైర్యం చెప్పి భరోసా
నార్కెట్పల్లి మండలం ఔరవని గ్రామానికి చెందిన నిరుడు మురళీధర్ రెడ్డి అనారోగ్యంతో ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య మంగళవారం వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. అవసరమైన వైద్య సహాయం అందించాలని కుటుంబ సభ్యులకు సూచించారు.
అలాగే చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డుకు చెందిన మహమ్మద్ గౌస్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా ఆయనను కూడా చిరుమర్తి లింగయ్య పరామర్శించారు. ప్రమాద వివరాలు తెలుసుకుని ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని సూచిస్తూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఇదే సందర్భంగా చిట్యాల మున్సిపాలిటీ 10వ వార్డుకు చెందిన గండమళ్ళ శంకర్ అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి వద్ద చికిత్స పొందుతుండగా వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని మనోధైర్యం కోల్పోవద్దని సూచించారు.
ప్రజల కష్టసుఖాల్లో అండగా ఉంటానన్న చిరుమర్తి లింగయ్య.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి