PRINT TIME: July 11, 2026 07:56 AM
గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలి. మహిళా వారోత్సవాల్లో ఎసీడీపీవో సమీరా
గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలి. మహిళా వారోత్సవాల్లో ఎసీడీపీవో సమీరా
May 25, 2026 06:47 PM
37 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట,
గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్య సూచనలు పాటించాలని రామన్నపేట ఎసీడీపీవో సమీరా సూచించారు. మండల కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం మహిళా వారోత్సవాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన సదస్సులో సమీరా మాట్లాడుతూ తల్లి, శిశు ఆరోగ్య పరిరక్షణలో పోషకాహారం కీలకమని తెలిపారు. గర్భిణీలు, బాలింతలకు న్యూట్రిషన్పై అవగాహన కల్పించారు.
అనంతరం తల్లుల కోసం ఫుడ్ పోటీలు నిర్వహించగా మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆరోగ్య కార్యకర్తలు మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ హేమలత, ఏఎన్ఎంలు సాదియా, మంజుల, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి