Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భూ తగాదాలతో వ్యక్తి హత్య సోదరుడి కుమారుడిపైనే ఆరోపణలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 12:58 PM

ఘనంగా వనస్థలిపురం లో కేంబ్రిడ్జి మాంటెస్సోరి ప్రి స్కూల్ ప్రారంభం

ఘనంగా వనస్థలిపురం లో కేంబ్రిడ్జి మాంటెస్సోరి ప్రి స్కూల్ ప్రారంభం

   ఘనంగా వనస్థలిపురం లో కేంబ్రిడ్జి మాంటెస్సోరి ప్రి స్కూల్ ప్రారంభం
May 25, 2026 07:09 PM 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

చిన్నారులకు ఉత్తమ విద్య ప్రమాణాలు అందించే దిశగా పాఠశాల ముందుకు సాగాలని రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

చిన్నారులకు నాణ్యమైన ప్రాథమిక విద్యతో పాటు సృజనాత్మక అభివృద్ధి కల్పించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కేంబ్రిడ్జ్ మాంటెస్సోరి ప్రీ స్కూల్ వనస్థలిపురంలో సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నర్సింహా రెడ్డి, మాజీ కార్పొరేటర్లు జిట్ట రాజశేఖర్ రెడ్డి, రాగుల వెంకటేశ్వర్ రెడ్డి హాజరై నిర్వాహకులతో కలిసి పాఠశాలను ఘనంగా ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ చిన్నారులకు ఉత్తమ విద్యా ప్రమాణాలు అందించే దిశగా పాఠశాల ముందుకు సాగాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో అతిథులను యాజమాన్యం ఘనంగా సన్మానించింది. మాంటెస్సోరి, కేంబ్రిడ్జ్ విద్యా విధానాల ఆధారంగా రూపొందించిన ఈ విద్యాసంస్థలో కార్యాచరణ ఆధారిత బోధన, మైండ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్, నైపుణ్యాభివృద్ధి శిక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది.

అలాగే పిల్లలకు అనుకూలమైన సురక్షిత వాతావరణంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులతో విద్య అందించనున్నట్లు పేర్కొన్నారు. ఆధునిక తరగతి గదులు, రవాణా సౌకర్యం, చిన్నారుల మానసిక వికాసానికి తోడ్పడే ప్రత్యేక కార్యక్రమాలు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. ప్రస్తుతం పరిమిత అడ్మిషన్లు కొనసాగుతున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంస్థ ఎండీ, డైరెక్టర్ మౌనిక హరినాథ్, అకాడమిక్ కోఆర్డినేటర్ లక్ష్మి, విష్ణుప్రియతల్లిదండ్రులు,శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News