Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భూ తగాదాలతో వ్యక్తి హత్య సోదరుడి కుమారుడిపైనే ఆరోపణలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 12:59 PM

MSME పార్కుల శంకుస్థాపన అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న మార్కెట్ యార్డ్ చైర్మన్ పూల శివప్రసాద్.

MSME పార్కుల శంకుస్థాపన అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న మార్కెట్ యార్డ్ చైర్మన్ పూల శివప్రసాద్.

MSME  పార్కుల శంకుస్థాపన అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న మార్కెట్ యార్డ్ చైర్మన్ పూల శివప్రసాద్.
May 26, 2026 08:09 AM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

ధర్మవరం నియోజకవర్గం, బత్తలపల్లి మండలం, ఈదుల ముష్టూరు గ్రామంలో 175 MSME పార్కుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా 35కు పైగా MSME పార్కులు / FFCలకు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి, సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మంత్రి నియోజకవర్గ ఇంచార్జ్ హరీష్ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం RDO సువర్ణ సమక్షంలోనిర్వహించబడింది.

ఈ సందర్భంగా చిలకం మధుసూదన రెడ్డి మరియు అధికారులు మాట్లాడుతూ MSME పార్కుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు అభివృద్ధి చెందడంతో పాటు స్థానిక యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

మార్కెట్ చైర్మన్ శివ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలోనూ యువత చిన్నపాటి జీతాలకు పనిచేసే స్థాయి నుండి పదిమంది స్థానిక ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని అభివృద్ధి చెంది రాష్ట్రం మరియు దేశం పురోగతిలో పాలుపంచుకోవాలని ఆకాంక్షించారు.

తద్వారా చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత కల్పించడం, MSME పార్కుల ఏర్పాటు ద్వారా స్థానిక వ్యాపారులు, యువ పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News