MSME పార్కుల శంకుస్థాపన అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న మార్కెట్ యార్డ్ చైర్మన్ పూల శివప్రసాద్.
MSME పార్కుల శంకుస్థాపన అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న మార్కెట్ యార్డ్ చైర్మన్ పూల శివప్రసాద్.
Anjali
ధర్మవరం నియోజకవర్గం, బత్తలపల్లి మండలం, ఈదుల ముష్టూరు గ్రామంలో 175 MSME పార్కుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా 35కు పైగా MSME పార్కులు / FFCలకు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి, సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మంత్రి నియోజకవర్గ ఇంచార్జ్ హరీష్ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం RDO సువర్ణ సమక్షంలోనిర్వహించబడింది.
ఈ సందర్భంగా చిలకం మధుసూదన రెడ్డి మరియు అధికారులు మాట్లాడుతూ MSME పార్కుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు అభివృద్ధి చెందడంతో పాటు స్థానిక యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
మార్కెట్ చైర్మన్ శివ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలోనూ యువత చిన్నపాటి జీతాలకు పనిచేసే స్థాయి నుండి పదిమంది స్థానిక ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని అభివృద్ధి చెంది రాష్ట్రం మరియు దేశం పురోగతిలో పాలుపంచుకోవాలని ఆకాంక్షించారు.
తద్వారా చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత కల్పించడం, MSME పార్కుల ఏర్పాటు ద్వారా స్థానిక వ్యాపారులు, యువ పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి