Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:31 AM

MSME పార్కుల శంకుస్థాపన అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న మార్కెట్ యార్డ్ చైర్మన్ పూల శివప్రసాద్.

MSME పార్కుల శంకుస్థాపన అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న మార్కెట్ యార్డ్ చైర్మన్ పూల శివప్రసాద్.

MSME  పార్కుల శంకుస్థాపన అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న మార్కెట్ యార్డ్ చైర్మన్ పూల శివప్రసాద్.
May 26, 2026 08:09 AM 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

ధర్మవరం నియోజకవర్గం, బత్తలపల్లి మండలం, ఈదుల ముష్టూరు గ్రామంలో 175 MSME పార్కుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా 35కు పైగా MSME పార్కులు / FFCలకు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి, సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మంత్రి నియోజకవర్గ ఇంచార్జ్ హరీష్ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం RDO సువర్ణ సమక్షంలోనిర్వహించబడింది.

ఈ సందర్భంగా చిలకం మధుసూదన రెడ్డి మరియు అధికారులు మాట్లాడుతూ MSME పార్కుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు అభివృద్ధి చెందడంతో పాటు స్థానిక యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

మార్కెట్ చైర్మన్ శివ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలోనూ యువత చిన్నపాటి జీతాలకు పనిచేసే స్థాయి నుండి పదిమంది స్థానిక ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని అభివృద్ధి చెంది రాష్ట్రం మరియు దేశం పురోగతిలో పాలుపంచుకోవాలని ఆకాంక్షించారు.

తద్వారా చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత కల్పించడం, MSME పార్కుల ఏర్పాటు ద్వారా స్థానిక వ్యాపారులు, యువ పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News