Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భూ తగాదాలతో వ్యక్తి హత్య సోదరుడి కుమారుడిపైనే ఆరోపణలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 12:58 PM

లోకేష్ కృషితో ఏపీకి పెట్టుబడుల వెల్లువ. యువతకు లక్షల ఉద్యోగాలే లక్ష్యం : బెస్త రామాంజనేయులు

లోకేష్ కృషితో ఏపీకి పెట్టుబడుల వెల్లువ. యువతకు లక్షల ఉద్యోగాలే లక్ష్యం : బెస్త రామాంజనేయులు

లోకేష్ కృషితో ఏపీకి పెట్టుబడుల వెల్లువ.  యువతకు లక్షల ఉద్యోగాలే లక్ష్యం : బెస్త రామాంజనేయులు
May 26, 2026 08:18 AM 9 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విశిష్ట స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడంలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని ఏపీ బెస్త సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బెస్త రామాంజనేయులు అన్నారు.

విజయవాడలోని ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన, శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. రాష్ట్రానికి దేశ విదేశాల నుంచి భారీ పెట్టుబడులు తీసుకువస్తూ యువతకు లక్షలాది ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు లోకేష్ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని కొనియాడారు.

ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు మళ్లేలా అనుకూల వాతావరణం సృష్టించారని, గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని వీడిన సంస్థలు సైతం మళ్లీ ఏపీ వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల హామీ అమలుకు లోకేష్ కట్టుబడి పనిచేస్తున్నారని తెలిపారు.

ప్రాంతీయ అసమానతలు లేకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమానంగా పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకువస్తున్నారని చెప్పారు. పెట్టుబడుల ద్వారా రాష్ట్ర రూపురేఖలు మారుతున్నాయని, యువతలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆదోని రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, మంత్రాలయం, ఆలూరు నియోజకవర్గాల్లో తాగు, సాగునీటి సమస్యల పరిష్కారానికి నీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి కరువు, వలసలను నివారించాలని కోరారు.

దీనిపై మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించినట్లు బెస్త రామాంజనేయులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News