లోకేష్ కృషితో ఏపీకి పెట్టుబడుల వెల్లువ. యువతకు లక్షల ఉద్యోగాలే లక్ష్యం : బెస్త రామాంజనేయులు
లోకేష్ కృషితో ఏపీకి పెట్టుబడుల వెల్లువ. యువతకు లక్షల ఉద్యోగాలే లక్ష్యం : బెస్త రామాంజనేయులు
Editor Desk
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విశిష్ట స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడంలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని ఏపీ బెస్త సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బెస్త రామాంజనేయులు అన్నారు.
విజయవాడలోని ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన, శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. రాష్ట్రానికి దేశ విదేశాల నుంచి భారీ పెట్టుబడులు తీసుకువస్తూ యువతకు లక్షలాది ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు లోకేష్ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని కొనియాడారు.
ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు మళ్లేలా అనుకూల వాతావరణం సృష్టించారని, గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని వీడిన సంస్థలు సైతం మళ్లీ ఏపీ వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల హామీ అమలుకు లోకేష్ కట్టుబడి పనిచేస్తున్నారని తెలిపారు.
ప్రాంతీయ అసమానతలు లేకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమానంగా పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకువస్తున్నారని చెప్పారు. పెట్టుబడుల ద్వారా రాష్ట్ర రూపురేఖలు మారుతున్నాయని, యువతలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆదోని రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, మంత్రాలయం, ఆలూరు నియోజకవర్గాల్లో తాగు, సాగునీటి సమస్యల పరిష్కారానికి నీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి కరువు, వలసలను నివారించాలని కోరారు.
దీనిపై మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించినట్లు బెస్త రామాంజనేయులు తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి