Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భూ తగాదాలతో వ్యక్తి హత్య సోదరుడి కుమారుడిపైనే ఆరోపణలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 12:56 PM

చెరుకుపల్లి చెరువుకు కేటుగాళ్ల గుంత

చెరుకుపల్లి చెరువుకు కేటుగాళ్ల గుంత

చెరుకుపల్లి చెరువుకు కేటుగాళ్ల గుంత
May 25, 2026 09:06 PM 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy


పర్మిషన్ ముసుగులో యదేచ్ఛగా మట్టి దోపిడి.. ఇటుక బట్టీలకు తరలింపు.

అధికారుల కనుసన్నల్లోనే అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయంటూ స్థానికుల ఆరోపణ.

నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలోని చెరుకుపల్లి గ్రామంలో చెరువు మట్టి అక్రమ తవ్వకాలు బహిరంగంగా సాగుతున్నాయనే ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. చెరువు అభివృద్ధి పేరుతో పరిమిత అనుమతులు తీసుకున్న కొందరు వ్యక్తులు, వాటిని అడ్డుపెట్టుకుని అనుమతించిన దానికంటే పలుమార్లు ఎక్కువ లోతులో తవ్వకాలు చేపడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

పగలు, రాత్రి అనే తేడా లేకుండా భారీ టిప్పర్లతో చెరువు మట్టిని తరలిస్తూ సమీప ఇటుక బట్టీలకు విక్రయిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చెరువు గర్భాన్ని యంత్రాలతో లోతుగా తవ్వడంతో నీటి నిల్వ సామర్థ్యం దెబ్బతింటోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అక్రమ మట్టి తరలింపుతో గ్రామీణ రహదారులు దెబ్బతింటుండగా, టిప్పర్ల రాకపోకలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. , రైతులు, వృద్ధులు భయాందోళనల మధ్య ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు చెబుతున్నారు.

ఇంత పెద్ద ఎత్తున తవ్వకాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని, కొందరు అధికారుల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం నడుస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అనుమతుల నిబంధనలు ఉల్లంఘించి చెరువు సహజ స్వరూపాన్ని మార్చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ మట్టి తవ్వకాలను తక్షణమే నిలిపివేసి చెరువులను కాపాడాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. పర్యావరణ సమతౌల్యానికి ఆధారమైన చెరువులను అక్రమ మాఫియాల బారిన పడనివ్వొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News