PRINT TIME: May 26, 2026 04:33 PM
వరి కొయ్యలకు నిప్పులు పెట్టిన వారిపై కేసు నమోదు చేయాలి. సర్పంచ్ సందీప్కుమార్
వరి కొయ్యలకు నిప్పులు పెట్టిన వారిపై కేసు నమోదు చేయాలి. సర్పంచ్ సందీప్కుమార్
May 26, 2026 03:23 PM
19 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
మిర్యాలగూడ,: వేములపల్లి గ్రామపంచాయతీ పరిధిలో చెరువుల నీటిని అక్రమంగా తూముల ద్వారా బయటకు వదిలిన వారిపై, అలాగే వరి కొయ్యలకు నిప్పులు పెట్టిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని సర్పంచ్ సందీప్కుమార్ డిమాండ్ చేశారు.
ఈ మేరకు సోమవారం వేములపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గ్రామ పరిధిలోని రెండు చెరువుల నీటిని అక్రమంగా విడుదల చేయడం వల్ల రైతులకు నష్టం జరుగుతోందన్నారు. అదేవిధంగా వరి కొయ్యలకు నిప్పులు పెట్టడం వల్ల పర్యావరణానికి హాని కలగడంతో పాటు ఇతర రైతులకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.
ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి