Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లోకి దారి తప్పి వచ్చిన జింక.. అప్రమత్తమైన అటవీశాఖ! నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 07:00 AM

వరి కొయ్యలకు నిప్పులు పెట్టిన వారిపై కేసు నమోదు చేయాలి. సర్పంచ్‌ సందీప్‌కుమార్‌

వరి కొయ్యలకు నిప్పులు పెట్టిన వారిపై కేసు నమోదు చేయాలి. సర్పంచ్‌ సందీప్‌కుమార్‌

వరి కొయ్యలకు నిప్పులు పెట్టిన వారిపై కేసు నమోదు చేయాలి. సర్పంచ్‌ సందీప్‌కుమార్‌
May 26, 2026 03:23 PM 51 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మిర్యాలగూడ,: వేములపల్లి గ్రామపంచాయతీ పరిధిలో చెరువుల నీటిని అక్రమంగా తూముల ద్వారా బయటకు వదిలిన వారిపై, అలాగే వరి కొయ్యలకు నిప్పులు పెట్టిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని సర్పంచ్‌ సందీప్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

ఈ మేరకు సోమవారం వేములపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గ్రామ పరిధిలోని రెండు చెరువుల నీటిని అక్రమంగా విడుదల చేయడం వల్ల రైతులకు నష్టం జరుగుతోందన్నారు. అదేవిధంగా వరి కొయ్యలకు నిప్పులు పెట్టడం వల్ల పర్యావరణానికి హాని కలగడంతో పాటు ఇతర రైతులకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.

ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News