రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలి ఇన్చార్జి ఏడీఏ ఋషీంద్రమణి
రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలి ఇన్చార్జి ఏడీఏ ఋషీంద్రమణి
Editor Desk
మిర్యాలగూడ, తెలంగాణలో భూమి ఉన్న ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలని వ్యవసాయ శాఖ ఇన్చార్జి ఏడీఏ ఋషీంద్రమణి సూచించారు. స్థానికంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా రైతులకు ప్రత్యేకమైన 12 అంకెల డిజిటల్ ఐడీ లభిస్తుందని, ఇది ఆధార్ కార్డు తరహాలో ఉపయోగపడుతుందని తెలిపారు. భవిష్యత్తులో రైతుబంధు, పీఎం కిసాన్, పంటల బీమా, విత్తనాలు, ఎరువుల సబ్సిడీలు వంటి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందాలంటే ఈ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అవుతుందని వివరించారు.
గ్రామాల్లోని రైతు వేదికల వద్ద వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓలు) ఉచితంగా నమోదు చేస్తున్నారని, మీ సేవా కేంద్రాల్లో కూడా ఈ ప్రక్రియ అందుబాటులో ఉందన్నారు.
రిజిస్ట్రేషన్కు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు అవసరమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఈఓలు ఎండి షఫీ, గోపి, రమేష్, రైతులు యాదమ్మ, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి