Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
50 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలి. “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 02:18 PM

రైతులు తప్పనిసరిగా ఫార్మర్‌ రిజిస్ట్రీ చేయించుకోవాలి ఇన్‌చార్జి ఏడీఏ ఋషీంద్రమణి

రైతులు తప్పనిసరిగా ఫార్మర్‌ రిజిస్ట్రీ చేయించుకోవాలి ఇన్‌చార్జి ఏడీఏ ఋషీంద్రమణి

రైతులు తప్పనిసరిగా ఫార్మర్‌ రిజిస్ట్రీ చేయించుకోవాలి ఇన్‌చార్జి ఏడీఏ ఋషీంద్రమణి
26-05-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మిర్యాలగూడ, తెలంగాణలో భూమి ఉన్న ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్‌ రిజిస్ట్రీ చేయించుకోవాలని వ్యవసాయ శాఖ ఇన్‌చార్జి ఏడీఏ ఋషీంద్రమణి సూచించారు. స్థానికంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.

ఫార్మర్‌ రిజిస్ట్రీ ద్వారా రైతులకు ప్రత్యేకమైన 12 అంకెల డిజిటల్‌ ఐడీ లభిస్తుందని, ఇది ఆధార్‌ కార్డు తరహాలో ఉపయోగపడుతుందని తెలిపారు. భవిష్యత్తులో రైతుబంధు, పీఎం కిసాన్‌, పంటల బీమా, విత్తనాలు, ఎరువుల సబ్సిడీలు వంటి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందాలంటే ఈ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి అవుతుందని వివరించారు.

గ్రామాల్లోని రైతు వేదికల వద్ద వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓలు) ఉచితంగా నమోదు చేస్తున్నారని, మీ సేవా కేంద్రాల్లో కూడా ఈ ప్రక్రియ అందుబాటులో ఉందన్నారు.

రిజిస్ట్రేషన్‌కు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు అవసరమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఈఓలు ఎండి షఫీ, గోపి, రమేష్‌, రైతులు యాదమ్మ, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రైతులు తప్పనిసరిగా ఫార్మర్‌ రిజిస్ట్రీ చేయించుకోవాలి ఇన్‌చార్జి ఏడీఏ ఋషీంద్రమణి

Article Image

మిర్యాలగూడ, తెలంగాణలో భూమి ఉన్న ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్‌ రిజిస్ట్రీ చేయించుకోవాలని వ్యవసాయ శాఖ ఇన్‌చార్జి ఏడీఏ ఋషీంద్రమణి సూచించారు. స్థానికంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.

ఫార్మర్‌ రిజిస్ట్రీ ద్వారా రైతులకు ప్రత్యేకమైన 12 అంకెల డిజిటల్‌ ఐడీ లభిస్తుందని, ఇది ఆధార్‌ కార్డు తరహాలో ఉపయోగపడుతుందని తెలిపారు. భవిష్యత్తులో రైతుబంధు, పీఎం కిసాన్‌, పంటల బీమా, విత్తనాలు, ఎరువుల సబ్సిడీలు వంటి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందాలంటే ఈ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి అవుతుందని వివరించారు.

గ్రామాల్లోని రైతు వేదికల వద్ద వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓలు) ఉచితంగా నమోదు చేస్తున్నారని, మీ సేవా కేంద్రాల్లో కూడా ఈ ప్రక్రియ అందుబాటులో ఉందన్నారు.

రిజిస్ట్రేషన్‌కు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు అవసరమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఈఓలు ఎండి షఫీ, గోపి, రమేష్‌, రైతులు యాదమ్మ, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News