భూ తగాదాలతో వ్యక్తి హత్య సోదరుడి కుమారుడిపైనే ఆరోపణలు
భూ తగాదాలతో వ్యక్తి హత్య సోదరుడి కుమారుడిపైనే ఆరోపణలు
Biksham
సూర్యాపేట మండలంలోని సోలిపేట గ్రామంలో భూ వివాదాలు ఓ వ్యక్తి ప్రాణం తీసిన ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మేకల జయరాములు(50) హత్యకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, జయరాములకు నలుగురు అన్నదమ్ములు ఉండగా, సోదరుడు కృష్ణయ్యతో వ్యవసాయ భూమి విషయంలో కొన్నేళ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి.
ఇటీవల కృష్ణయ్య కుమారుడు పొలంలో బోరు వేయించడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ మరింత పెరిగింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఆగ్రహంతో కుటుంబ సభ్యులే జయరాములుపై దాడి చేసి హత్య చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి.
నిందితుడు కేంద్ర రిజర్వు పోలీసు దళంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడని మృతుడి భార్య ఆరోపించింది. సమాచారం అందుకున్న గ్రామీణ ఉప నిరీక్షకుడు బాలు నాయక్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి