Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 01:44 AM

భూ తగాదాలతో వ్యక్తి హత్య సోదరుడి కుమారుడిపైనే ఆరోపణలు

భూ తగాదాలతో వ్యక్తి హత్య సోదరుడి కుమారుడిపైనే ఆరోపణలు

భూ తగాదాలతో వ్యక్తి హత్య  సోదరుడి కుమారుడిపైనే ఆరోపణలు
May 26, 2026 08:09 AM 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట మండలంలోని సోలిపేట గ్రామంలో భూ వివాదాలు ఓ వ్యక్తి ప్రాణం తీసిన ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మేకల జయరాములు(50) హత్యకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, జయరాములకు నలుగురు అన్నదమ్ములు ఉండగా, సోదరుడు కృష్ణయ్యతో వ్యవసాయ భూమి విషయంలో కొన్నేళ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి.

ఇటీవల కృష్ణయ్య కుమారుడు పొలంలో బోరు వేయించడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ మరింత పెరిగింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఆగ్రహంతో కుటుంబ సభ్యులే జయరాములుపై దాడి చేసి హత్య చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి.

నిందితుడు కేంద్ర రిజర్వు పోలీసు దళంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడని మృతుడి భార్య ఆరోపించింది. సమాచారం అందుకున్న గ్రామీణ ఉప నిరీక్షకుడు బాలు నాయక్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News