Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భూ తగాదాలతో వ్యక్తి హత్య సోదరుడి కుమారుడిపైనే ఆరోపణలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 12:57 PM

భూ తగాదాలతో వ్యక్తి హత్య సోదరుడి కుమారుడిపైనే ఆరోపణలు

భూ తగాదాలతో వ్యక్తి హత్య సోదరుడి కుమారుడిపైనే ఆరోపణలు

భూ తగాదాలతో వ్యక్తి హత్య  సోదరుడి కుమారుడిపైనే ఆరోపణలు
May 26, 2026 08:09 AM 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట మండలంలోని సోలిపేట గ్రామంలో భూ వివాదాలు ఓ వ్యక్తి ప్రాణం తీసిన ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మేకల జయరాములు(50) హత్యకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, జయరాములకు నలుగురు అన్నదమ్ములు ఉండగా, సోదరుడు కృష్ణయ్యతో వ్యవసాయ భూమి విషయంలో కొన్నేళ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి.

ఇటీవల కృష్ణయ్య కుమారుడు పొలంలో బోరు వేయించడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ మరింత పెరిగింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఆగ్రహంతో కుటుంబ సభ్యులే జయరాములుపై దాడి చేసి హత్య చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి.

నిందితుడు కేంద్ర రిజర్వు పోలీసు దళంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడని మృతుడి భార్య ఆరోపించింది. సమాచారం అందుకున్న గ్రామీణ ఉప నిరీక్షకుడు బాలు నాయక్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News