Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:51 AM

ఐదు తరాల కలయిక.. దుబ్బాకలో ఆత్మీయతల సందడి

ఐదు తరాల కలయిక.. దుబ్బాకలో ఆత్మీయతల సందడి

ఐదు తరాల కలయిక..  దుబ్బాకలో ఆత్మీయతల సందడి
25-05-2026 562 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కుటుంబ బంధాలకు కొత్త ఊపిరి.. ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు ఆదర్శంగా సమ్మేళనం

రామన్నపేట,

మారుతున్న కాలంతో ఉమ్మడి కుటుంబాల సంస్కృతి క్రమంగా కనుమరుగవుతున్న వేళ.. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక గ్రామంలో నిర్వహించిన గట్టు సాయమ్మ–ఈదయ్య కుటుంబ ఆత్మీయ సమ్మేళనం అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదు తరాల సభ్యులు ఒకే వేదికపై కలుసుకుని ఆప్యాయతలు పంచుకోవడం అరుదైన ఘట్టంగా మారింది.

సాంకేతిక యుగ ప్రభావంతో కుటుంబ సభ్యుల మధ్య దూరాలు పెరుగుతున్న తరుణంలో పెద్దలు, యువత, చిన్నారులు కలిసి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సందడి చేశారు. కుటుంబ మూలాలు, పూర్వీకుల సంప్రదాయాలు, పరస్పర గౌరవం, కుటుంబ విలువల గురించి పెద్దలు యువతకు వివరించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

చిన్నతరం పెద్దల ఆశీర్వాదాలు పొందగా.. పెద్దతరం తమ వారసులను చూసి ఆనంద భాష్పాలు పెట్టుకున్నారు. కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనాలు చేయడం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, మృతి చెందిన కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థం ప్రదర్శించిన భావోద్వేగ వీడియో హాజరైన వారిని కంటతడి పెట్టించింది.

ఉన్నత ఉద్యోగులు, వైద్యులు, ఐటీ రంగ ఉద్యోగులు, వ్యాపారులు, ప్రజాప్రతినిధులుగా ఉన్న కుటుంబ సభ్యులందరూ ఒకే చోట చేరడం విశేషంగా నిలిచింది. సమాజంలో పెరుగుతున్న స్వార్థ ధోరణుల మధ్య ఇలాంటి కుటుంబ సమ్మేళనాలు మానవ సంబంధాలకు కొత్త ఊపిరి పోస్తాయని గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు.

భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని ప్రతిబింబించిన ఈ సమ్మేళనం మరెన్నో కుటుంబాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని పలువురు పేర్కొన్నారు.

Sthanikam

ఐదు తరాల కలయిక.. దుబ్బాకలో ఆత్మీయతల సందడి

Article Image

కుటుంబ బంధాలకు కొత్త ఊపిరి.. ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు ఆదర్శంగా సమ్మేళనం

రామన్నపేట,

మారుతున్న కాలంతో ఉమ్మడి కుటుంబాల సంస్కృతి క్రమంగా కనుమరుగవుతున్న వేళ.. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక గ్రామంలో నిర్వహించిన గట్టు సాయమ్మ–ఈదయ్య కుటుంబ ఆత్మీయ సమ్మేళనం అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదు తరాల సభ్యులు ఒకే వేదికపై కలుసుకుని ఆప్యాయతలు పంచుకోవడం అరుదైన ఘట్టంగా మారింది.

సాంకేతిక యుగ ప్రభావంతో కుటుంబ సభ్యుల మధ్య దూరాలు పెరుగుతున్న తరుణంలో పెద్దలు, యువత, చిన్నారులు కలిసి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సందడి చేశారు. కుటుంబ మూలాలు, పూర్వీకుల సంప్రదాయాలు, పరస్పర గౌరవం, కుటుంబ విలువల గురించి పెద్దలు యువతకు వివరించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

చిన్నతరం పెద్దల ఆశీర్వాదాలు పొందగా.. పెద్దతరం తమ వారసులను చూసి ఆనంద భాష్పాలు పెట్టుకున్నారు. కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనాలు చేయడం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, మృతి చెందిన కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థం ప్రదర్శించిన భావోద్వేగ వీడియో హాజరైన వారిని కంటతడి పెట్టించింది.

ఉన్నత ఉద్యోగులు, వైద్యులు, ఐటీ రంగ ఉద్యోగులు, వ్యాపారులు, ప్రజాప్రతినిధులుగా ఉన్న కుటుంబ సభ్యులందరూ ఒకే చోట చేరడం విశేషంగా నిలిచింది. సమాజంలో పెరుగుతున్న స్వార్థ ధోరణుల మధ్య ఇలాంటి కుటుంబ సమ్మేళనాలు మానవ సంబంధాలకు కొత్త ఊపిరి పోస్తాయని గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు.

భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని ప్రతిబింబించిన ఈ సమ్మేళనం మరెన్నో కుటుంబాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని పలువురు పేర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News