ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ
K.RAVI
రోగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న పురపాలక వైస్ చైర్మన్
నాణ్యమైన చికిత్స అందించాలని వైద్యులకు ఆదేశం
చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం పురపాలక వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ వార్డులను తనిఖీ చేసిన ఆయన, రోగులకు అందుతున్న వైద్య సేవలను స్వయంగా పరిశీలించారు.అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో వినయ్ కుమార్ నేరుగా మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితులను, ఆసుపత్రిలో ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.పేద ప్రజలకు నమ్మకమైన వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేయాలని వైస్ చైర్మన్ పేర్కొన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, నాణ్యమైన చికిత్స, మందులు సకాలంలో అందించాలని వైద్యులు, సిబ్బందికి సూచించారు.
ప్రజలకు మెరుగైన, నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందేలా తాము ఎల్లప్పుడూ కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, మున్సిపల్ ప్రతినిధులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి