Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:55 AM

ఖాజా మొయినుద్దీన్ కుటుంబానికి భద్రత కల్పించాలి: ఐలు నేత మామిడి వెంకట్ రెడ్డి

ఖాజా మొయినుద్దీన్ కుటుంబానికి భద్రత కల్పించాలి: ఐలు నేత మామిడి వెంకట్ రెడ్డి

ఖాజా మొయినుద్దీన్ కుటుంబానికి భద్రత కల్పించాలి: ఐలు నేత మామిడి వెంకట్ రెడ్డి
25-05-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

న్యాయవాది హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేయాలి.

న్యాయవాది ఖాజా మొయినుద్దీన్‌పై పథకం ప్రకారం కారుతో దాడి చేసి హత్య చేసిన దుండగులతో పాటు వారి వెనుక ఉన్న రాజకీయ నాయకులను తక్షణమే అరెస్టు చేయాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్‌కు ముందునుంచే బెదిరింపులు, దాడులు జరుగుతున్నప్పటికీ పోలీసులు సరైన భద్రత కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

మరణించిన న్యాయవాది కుటుంబ సభ్యులకు తగిన భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. న్యాయవాదుల రక్షణ చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ న్యాయవాదులపై దాడులు కొనసాగుతున్నాయని, ఇవి రోజురోజుకూ పెరుగుతున్నాయని పేర్కొన్నారు.

వ్యక్తులను హత్య చేస్తే న్యాయం ఆగిపోదని, న్యాయవాదులపై దాడి చేసే సంస్కృతికి ముగింపు పలకాలని ఆయన అన్నారు. బాధిత కుటుంబానికి ఐలు తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ యాదాసు యాదయ్య, ఐలు జిల్లా ఉపాధ్యక్షులు పాల్వంచ జగతయ్య, గడ్డం నర్సయ్య, జితేందర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఖాజా మొయినుద్దీన్ కుటుంబానికి భద్రత కల్పించాలి: ఐలు నేత మామిడి వెంకట్ రెడ్డి

Article Image

న్యాయవాది హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేయాలి.

న్యాయవాది ఖాజా మొయినుద్దీన్‌పై పథకం ప్రకారం కారుతో దాడి చేసి హత్య చేసిన దుండగులతో పాటు వారి వెనుక ఉన్న రాజకీయ నాయకులను తక్షణమే అరెస్టు చేయాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్‌కు ముందునుంచే బెదిరింపులు, దాడులు జరుగుతున్నప్పటికీ పోలీసులు సరైన భద్రత కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

మరణించిన న్యాయవాది కుటుంబ సభ్యులకు తగిన భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. న్యాయవాదుల రక్షణ చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ న్యాయవాదులపై దాడులు కొనసాగుతున్నాయని, ఇవి రోజురోజుకూ పెరుగుతున్నాయని పేర్కొన్నారు.

వ్యక్తులను హత్య చేస్తే న్యాయం ఆగిపోదని, న్యాయవాదులపై దాడి చేసే సంస్కృతికి ముగింపు పలకాలని ఆయన అన్నారు. బాధిత కుటుంబానికి ఐలు తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ యాదాసు యాదయ్య, ఐలు జిల్లా ఉపాధ్యక్షులు పాల్వంచ జగతయ్య, గడ్డం నర్సయ్య, జితేందర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News