Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భూ తగాదాలతో వ్యక్తి హత్య సోదరుడి కుమారుడిపైనే ఆరోపణలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 12:58 PM

ఖాజా మొయినుద్దీన్ కుటుంబానికి భద్రత కల్పించాలి: ఐలు నేత మామిడి వెంకట్ రెడ్డి

ఖాజా మొయినుద్దీన్ కుటుంబానికి భద్రత కల్పించాలి: ఐలు నేత మామిడి వెంకట్ రెడ్డి

ఖాజా మొయినుద్దీన్ కుటుంబానికి భద్రత కల్పించాలి: ఐలు నేత మామిడి వెంకట్ రెడ్డి
May 25, 2026 04:36 PM 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

న్యాయవాది హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేయాలి.

న్యాయవాది ఖాజా మొయినుద్దీన్‌పై పథకం ప్రకారం కారుతో దాడి చేసి హత్య చేసిన దుండగులతో పాటు వారి వెనుక ఉన్న రాజకీయ నాయకులను తక్షణమే అరెస్టు చేయాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్‌కు ముందునుంచే బెదిరింపులు, దాడులు జరుగుతున్నప్పటికీ పోలీసులు సరైన భద్రత కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

మరణించిన న్యాయవాది కుటుంబ సభ్యులకు తగిన భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. న్యాయవాదుల రక్షణ చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ న్యాయవాదులపై దాడులు కొనసాగుతున్నాయని, ఇవి రోజురోజుకూ పెరుగుతున్నాయని పేర్కొన్నారు.

వ్యక్తులను హత్య చేస్తే న్యాయం ఆగిపోదని, న్యాయవాదులపై దాడి చేసే సంస్కృతికి ముగింపు పలకాలని ఆయన అన్నారు. బాధిత కుటుంబానికి ఐలు తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ యాదాసు యాదయ్య, ఐలు జిల్లా ఉపాధ్యక్షులు పాల్వంచ జగతయ్య, గడ్డం నర్సయ్య, జితేందర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News