టెన్త్ టాపర్లకు సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ సన్మానం
టెన్త్ టాపర్లకు సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ సన్మానం
Editor Desk
రామన్నపేట మండలం లోని ఇంద్రపాలనగరం స్థానిక జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో టెన్త్ ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించడంతో పాటు 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులను గురువారం సన్మానించారు. టాపర్లుగా నిలిచిన గర్ధాస్ మానస, రాస వైష్ణవి, బొల్ల శ్రీనిధి, నాహేరా అంజూమ్, కనకబోయిన శివానిలను గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్, ప్రధానోపాధ్యాయుడు కె. శేఖర్ అభినందించి స్వీట్లు పంపిణీ చేశారు.
మంచి ఫలితాల సాధనకు కృషి చేసిన ఉపాధ్యాయ బృందాన్ని ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎన్. నిర్మల మేరీ, ఎం. ఆల్వాల్ రెడ్డి, కె. శ్రీనివాస్ రెడ్డి, ఎస్వీఎస్ అన్నపూర్ణ, బి. అశోక్, కె. లింగస్వామి, జి. ప్రసన్న లక్ష్మి, పి. గీత, పి. సైదులు, పి. మణి, పీడీ ఎం. వేణు, కె. పెంటయ్య, పి. అరుణ, ఏఏపీసీ చైర్మన్ కె. మమత, యువనాయకులు సింగణబోయిన గణేష్ యాదవ్, గర్ధాస్ కరుణాకర్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ పగుడాల వెంకటేష్, బొల్ల నర్సింహా, గర్ధాస్ బలరాం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి