Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హరీష్ రావును కలిసిన ఉద్యమ నేత ఎస్.కె. చాంద్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా కీలక ముందడుగు కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు – ప్రతిభావంతుల సత్కారం డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 08, 2026 12:23 AM

యువతను డ్రగ్స్ బారిన పడనీయొద్దు: అధికారులకు అదనపు కలెక్టర్ సూచన

యువతను డ్రగ్స్ బారిన పడనీయొద్దు: అధికారులకు అదనపు కలెక్టర్ సూచన

యువతను డ్రగ్స్ బారిన పడనీయొద్దు: అధికారులకు అదనపు కలెక్టర్ సూచన
March 13, 2026 08:11 PM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండలం తడ్కాల్ గ్రామంలో రంజాన్ పండుగ సందర్భంగా నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పట్లోల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ సుగుణ మల్లారెడ్డి ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మైనార్టీ సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగ మతసామరస్యానికి, సోదరభావానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఉపవాస దీక్షతో నియమ నిష్టలతో జీవిస్తూ సమాజంలో శాంతి, సహనం, సేవాభావాన్ని పెంపొందించే పండుగ రంజాన్ అని తెలిపారు. మైనార్టీ సోదరులకు పండ్లు తినిపించి రోజా విడిపించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజంలో అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవంతో, సఖ్యతతో జీవించడం ఎంతో ముఖ్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మల్లారెడ్డి, తడ్కాల్ గ్రామ సర్పంచ్ ఎలిచాలా సుగుణ మల్లారెడ్డి, శ్రీకాంత్,శివాజీ పాటిల్, రామగౌడ్, అమిన్, హన్మంత్, ధాత్త రెడ్డి, వైద్యనాథ్ పటేల్, బాబు సాబ్, డాక్టర్ హమీద్, మాజీ సర్పంచ్ మనోహర్ పాటిల్, బి. రాజు ముదిరాజ్, మహేష్ కౌన్సిలర్లు, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ రెడ్డి, ఇదయాత్, కాజా సాబ్, ఆకుల రాములు, మారుతీరావు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News