Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 13, 2026 10:50 PM

యువతను డ్రగ్స్ బారిన పడనీయొద్దు: అధికారులకు అదనపు కలెక్టర్ సూచన

యువతను డ్రగ్స్ బారిన పడనీయొద్దు: అధికారులకు అదనపు కలెక్టర్ సూచన

యువతను డ్రగ్స్ బారిన పడనీయొద్దు: అధికారులకు అదనపు కలెక్టర్ సూచన
March 13, 2026 08:11 PM 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sangareddy & Manoor
Sthanikam joint District Staff Reporter krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండలం తడ్కాల్ గ్రామంలో రంజాన్ పండుగ సందర్భంగా నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పట్లోల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ సుగుణ మల్లారెడ్డి ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మైనార్టీ సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగ మతసామరస్యానికి, సోదరభావానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఉపవాస దీక్షతో నియమ నిష్టలతో జీవిస్తూ సమాజంలో శాంతి, సహనం, సేవాభావాన్ని పెంపొందించే పండుగ రంజాన్ అని తెలిపారు. మైనార్టీ సోదరులకు పండ్లు తినిపించి రోజా విడిపించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజంలో అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవంతో, సఖ్యతతో జీవించడం ఎంతో ముఖ్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మల్లారెడ్డి, తడ్కాల్ గ్రామ సర్పంచ్ ఎలిచాలా సుగుణ మల్లారెడ్డి, శ్రీకాంత్,శివాజీ పాటిల్, రామగౌడ్, అమిన్, హన్మంత్, ధాత్త రెడ్డి, వైద్యనాథ్ పటేల్, బాబు సాబ్, డాక్టర్ హమీద్, మాజీ సర్పంచ్ మనోహర్ పాటిల్, బి. రాజు ముదిరాజ్, మహేష్ కౌన్సిలర్లు, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ రెడ్డి, ఇదయాత్, కాజా సాబ్, ఆకుల రాములు, మారుతీరావు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News