Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 27, 2026 09:20 PM

యువత స్వయం ఉపాధితో ముందుకు రావాలి: సర్పంచ్ గర్ధాస్ విక్రమ్

యువత స్వయం ఉపాధితో ముందుకు రావాలి: సర్పంచ్ గర్ధాస్ విక్రమ్

యువత స్వయం ఉపాధితో ముందుకు రావాలి: సర్పంచ్ గర్ధాస్ విక్రమ్
February 27, 2026 07:10 PM 54 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

ఇంద్రపాలనగరంలో 99 రూపాయల బిర్యానీ సెంటర్ ప్రారంభం

ఇంద్రపాలనగరం: గ్రామంలో స్వయం ఉపాధి అవకాశాలకు ఊతమిస్తూ ‘కావ్య దీక్ష ఫాస్ట్ ఫుడ్ అండ్ 99 రూపాయల బిర్యానీ సెంటర్’ను శుక్రవారం సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్తులకు నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించడమే లక్ష్యమని తెలిపారు. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా స్వశక్తితో వ్యాపార రంగంలో అడుగుపెట్టి ఆర్థికంగా ఎదగాలని సూచించారు. గ్రామంలో స్వయం ఉపాధి అవకాశాలను వెతికి అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో 1వ వార్డు సభ్యురాలు పంది నాగలక్ష్మి రాజు, 8వ వార్డు సభ్యురాలు పుట్టల లక్ష్మమ్మ ముత్యాలు, యువనాయకుడు సింగణబోయిన గణేష్ యాదవ్, గ్రామ సీనియర్ నాయకులు రాస వెంకటేష్, రవ్వ నర్సింహా, సింగణబోయిన జంగయ్య, ఈర్లపల్లి మల్లయ్య, రాజన్న రమేష్, నక్క వెంకటేష్, పుట్టల దానయ్య, చిన్నపాక సురేష్, మల్లం రమేష్, కోడారి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ యువకులు, ప్రజలు హాజరై నిర్వాహకులను అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News