Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:33 AM

యాదగిరిగుట్టలో వైభవంగా పూర్ణాహుతి,చక్రతీర్థ స్నాన ఘట్టం

యాదగిరిగుట్టలో వైభవంగా పూర్ణాహుతి,చక్రతీర్థ స్నాన ఘట్టం

యాదగిరిగుట్టలో వైభవంగా పూర్ణాహుతి,చక్రతీర్థ స్నాన ఘట్టం
27-02-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం సన్నిధిలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల పదవ రోజున పూర్ణాహుతి, చక్రతీర్థ స్నాన ఘట్టం శాస్త్రోక్తంగా నిర్వహించారు.ఉదయం లక్ష్మీ సమేత నరసింహ స్వామివారిని ఆలయం నుంచి కొండపై ఉన్న విష్ణు పుష్కరిణి వరకు ప్రత్యేక సేవలో తీసుకువెళ్లి పూజలు నిర్వహించారు. అనంతరం వేదమంత్రాల నడుమ అర్చకులు విష్ణు పుష్కరిణిలో చక్రస్నానాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమాన్ని దర్శించేందుకు భారీ సంఖ్యలో భక్తులు హాజరై చక్రతీర్థ స్నానంలో పాల్గొన్నారు.ఫిబ్రవరి 18న స్వస్తివాచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు మార్చి 28న అష్టోత్తర శత ఘటాభిషేకంతో ముగియనున్నాయి.పాంచరాత్రాగమ శాస్త్రానుసారం ప్రధాన అర్చకులు, ఉప ప్రధాన అర్చకులు, అర్చక బృందం, వేద పండితులు,యజ్ఞా చార్యులు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈవో జే. భవాని శంకర్,అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి తదితర అధికారులు, సిబ్బంది మరియు భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

Sthanikam

యాదగిరిగుట్టలో వైభవంగా పూర్ణాహుతి,చక్రతీర్థ స్నాన ఘట్టం

Article Image

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం సన్నిధిలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల పదవ రోజున పూర్ణాహుతి, చక్రతీర్థ స్నాన ఘట్టం శాస్త్రోక్తంగా నిర్వహించారు.ఉదయం లక్ష్మీ సమేత నరసింహ స్వామివారిని ఆలయం నుంచి కొండపై ఉన్న విష్ణు పుష్కరిణి వరకు ప్రత్యేక సేవలో తీసుకువెళ్లి పూజలు నిర్వహించారు. అనంతరం వేదమంత్రాల నడుమ అర్చకులు విష్ణు పుష్కరిణిలో చక్రస్నానాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమాన్ని దర్శించేందుకు భారీ సంఖ్యలో భక్తులు హాజరై చక్రతీర్థ స్నానంలో పాల్గొన్నారు.ఫిబ్రవరి 18న స్వస్తివాచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు మార్చి 28న అష్టోత్తర శత ఘటాభిషేకంతో ముగియనున్నాయి.పాంచరాత్రాగమ శాస్త్రానుసారం ప్రధాన అర్చకులు, ఉప ప్రధాన అర్చకులు, అర్చక బృందం, వేద పండితులు,యజ్ఞా చార్యులు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈవో జే. భవాని శంకర్,అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి తదితర అధికారులు, సిబ్బంది మరియు భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News