Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 28, 2026 09:48 AM

వృద్ధురాలి మెడలో చైన్ లూటీ చేసిన విద్యుత్ శాఖ ప్రభుత్వ ఉద్యోగి

వృద్ధురాలి మెడలో చైన్ లూటీ చేసిన విద్యుత్ శాఖ ప్రభుత్వ ఉద్యోగి

వృద్ధురాలి మెడలో చైన్ లూటీ చేసిన విద్యుత్ శాఖ ప్రభుత్వ ఉద్యోగి
February 28, 2026 07:59 AM 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

తిరువూరు మండలంలో సంచలనం – నిందితుడి అరెస్ట్

ఎన్టీఆర్ జిల్లాలో సంచలనం రేపిన చైన్ దోపిడీ ఘటనను పోలీసులు చేధించారు. తిరువూరు మండలం చిక్కుళ్ళగూడెం గ్రామంలో వృద్ధురాలు ఉప్పు అనసూర్య మెడలో ఉన్న సుమారు నలభై గ్రాముల బంగారు నాన్తాడు చెయిన్‌ను లాక్కెళ్లిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు.

విచారణలో నిందితుడు ప్రభుత్వ ఉద్యోగి కావడం కలకలం రేపింది. విజయవాడకు చెందిన అసిస్టెంట్ లైన్మన్ నంద సుభాష్ ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఉద్యోగంలో కొనసాగుతూనే చెడు వ్యసనాలకు బానిసై నేరాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక విచారణలో బయటపడింది.

దోపిడీకి వినియోగించిన ద్విచక్ర వాహనాన్ని గానుగపాడు గ్రామంలో కొట్టేసినట్లు పోలీసులు గుర్తించారు. లక్ష్మీపురం శివారులో నిందితుడిని అదుపులోకి తీసుకుని, బంగారు చెయిన్‌తో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఈ వివరాలను సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కే. గిరిబాబు మీడియాకు వెల్లడించారు. సమావేశంలో ఉప ఇన్‌స్పెక్టర్ రాజు, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రభుత్వ ఉద్యోగి నేరానికి పాల్పడటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News