Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఏబీవీపీ ఆధ్వర్యంలో చౌటుప్పల్‌లో విద్యాసంస్థల బంద్ సక్సెస్! కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 02:02 PM

వంగవీటి మోహన్ రంగ విగ్రహావిష్కరణకు భారీగా హాజరైన అభిమానులు

వంగవీటి మోహన్ రంగ విగ్రహావిష్కరణకు భారీగా హాజరైన అభిమానులు

వంగవీటి మోహన్ రంగ విగ్రహావిష్కరణకు భారీగా హాజరైన అభిమానులు
March 01, 2026 06:32 PM 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎల్‌బీ నగర్ నియోజకవర్గం బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ ఎన్‌జీఓస్ కాలనీలోని కాపు సంఘం భవనం వద్ద పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రంగాగారి కుమారుడు వంగవీటి రాధాకృష్ణ, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, ఎల్‌బీ నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీ ప్రసన్న రామ్మోహన్ గౌడ్ పాల్గొన్నారు.

అతిథులు విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం రంగాగారి సేవలను స్మరించుకుంటూ ఆయన బడుగు, బలహీన వర్గాల కోసం చేసిన పోరాటం ప్రజలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రంగాగారి అభిమానులు, స్థానిక నాయకులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో హాజరై నివాళులు అర్పించారు. కార్యక్రమం భావోద్వేగ వాతావరణంలో కొనసాగింది.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News