వంగవీటి మోహన్ రంగ విగ్రహావిష్కరణకు భారీగా హాజరైన అభిమానులు
వంగవీటి మోహన్ రంగ విగ్రహావిష్కరణకు భారీగా హాజరైన అభిమానులు
స్థానికం బృందం
ఎల్బీ నగర్ నియోజకవర్గం బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ ఎన్జీఓస్ కాలనీలోని కాపు సంఘం భవనం వద్ద పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రంగాగారి కుమారుడు వంగవీటి రాధాకృష్ణ, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, ఎల్బీ నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీ ప్రసన్న రామ్మోహన్ గౌడ్ పాల్గొన్నారు.
అతిథులు విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం రంగాగారి సేవలను స్మరించుకుంటూ ఆయన బడుగు, బలహీన వర్గాల కోసం చేసిన పోరాటం ప్రజలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రంగాగారి అభిమానులు, స్థానిక నాయకులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో హాజరై నివాళులు అర్పించారు. కార్యక్రమం భావోద్వేగ వాతావరణంలో కొనసాగింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి