Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 01, 2026 07:59 PM

విస్సన్నపేటలో సిపిఐ ధర్నా మెడికల్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలి: మర్సకట్ల త్యాగరాజు

విస్సన్నపేటలో సిపిఐ ధర్నా మెడికల్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలి: మర్సకట్ల త్యాగరాజు

విస్సన్నపేటలో సిపిఐ ధర్నా మెడికల్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలి: మర్సకట్ల త్యాగరాజు
March 01, 2026 05:45 PM 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట: రాష్ట్రంలో మెడికల్ మాఫియా ఆగడాలకు చెక్ పెట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం విస్సన్నపేట స్థానిక బస్టాండ్ సెంటర్‌లో ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా సిపిఐ విస్సన్నపేట మండల కార్యదర్శి మర్సకట్ల త్యాగరాజు మాట్లాడుతూ కార్పొరేట్ ఆసుపత్రులు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజలను దోపిడీ చేస్తున్న ఇలాంటి ఆసుపత్రులపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే కల్తీ మందులు సరఫరా చేస్తున్న మెడికల్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

జనరిక్ మందులపై అధిక ధరలను అరికట్టాలని, పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న వైద్య సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

లేనిపక్షంలో సిపిఐ పార్టీ భవిష్యత్తులో నిరంతర ఉద్యమాలకు దిగుతుందని త్యాగరాజు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్. రాజేష్, పి. నాగేశ్వరరావు పాల్గొని నాయకత్వం వహించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News