Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:41 AM

విస్సన్నపేటలో సిపిఐ ధర్నా మెడికల్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలి: మర్సకట్ల త్యాగరాజు

విస్సన్నపేటలో సిపిఐ ధర్నా మెడికల్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలి: మర్సకట్ల త్యాగరాజు

విస్సన్నపేటలో సిపిఐ ధర్నా మెడికల్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలి: మర్సకట్ల త్యాగరాజు
01-03-2026 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట: రాష్ట్రంలో మెడికల్ మాఫియా ఆగడాలకు చెక్ పెట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం విస్సన్నపేట స్థానిక బస్టాండ్ సెంటర్‌లో ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా సిపిఐ విస్సన్నపేట మండల కార్యదర్శి మర్సకట్ల త్యాగరాజు మాట్లాడుతూ కార్పొరేట్ ఆసుపత్రులు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజలను దోపిడీ చేస్తున్న ఇలాంటి ఆసుపత్రులపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే కల్తీ మందులు సరఫరా చేస్తున్న మెడికల్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

జనరిక్ మందులపై అధిక ధరలను అరికట్టాలని, పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న వైద్య సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

లేనిపక్షంలో సిపిఐ పార్టీ భవిష్యత్తులో నిరంతర ఉద్యమాలకు దిగుతుందని త్యాగరాజు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్. రాజేష్, పి. నాగేశ్వరరావు పాల్గొని నాయకత్వం వహించారు.

Sthanikam

విస్సన్నపేటలో సిపిఐ ధర్నా మెడికల్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలి: మర్సకట్ల త్యాగరాజు

Article Image

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట: రాష్ట్రంలో మెడికల్ మాఫియా ఆగడాలకు చెక్ పెట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం విస్సన్నపేట స్థానిక బస్టాండ్ సెంటర్‌లో ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా సిపిఐ విస్సన్నపేట మండల కార్యదర్శి మర్సకట్ల త్యాగరాజు మాట్లాడుతూ కార్పొరేట్ ఆసుపత్రులు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజలను దోపిడీ చేస్తున్న ఇలాంటి ఆసుపత్రులపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే కల్తీ మందులు సరఫరా చేస్తున్న మెడికల్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

జనరిక్ మందులపై అధిక ధరలను అరికట్టాలని, పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న వైద్య సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

లేనిపక్షంలో సిపిఐ పార్టీ భవిష్యత్తులో నిరంతర ఉద్యమాలకు దిగుతుందని త్యాగరాజు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్. రాజేష్, పి. నాగేశ్వరరావు పాల్గొని నాయకత్వం వహించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News