Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 12:53 PM

విధి మాత్రమే కాదు… మానవత్వంలోనూ ముందున్న పోలీసులు

విధి మాత్రమే కాదు… మానవత్వంలోనూ ముందున్న పోలీసులు

విధి మాత్రమే కాదు… మానవత్వంలోనూ ముందున్న పోలీసులు
April 25, 2026 06:56 PM 501 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జహీరాబాద్ రూరల్ పోలీసు స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ మాసాని వెంకటరాములు అంత్యక్రియలకు జహీరాబాద్ సబ్ డివిజన్ పోలీస్ శాఖ సిబ్బంది నారాయణఖేడ్ పట్టణంలో హాజరై మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారి బాధను పంచుకున్నారు. అంత్యక్రియల సందర్భంగా ప్రజల సేవలో ఎల్లప్పుడూ ముందుండే పోలీసులు మరోసారి తమ మానవత్వాన్ని చాటిచెప్పారు. స్థానికంగా నిర్వహించిన అంతిమయాత్రలో పోలీసు సిబ్బంది స్వయంగా పాడె మోసి చివరి యాత్రలో పాల్గొని మృతునికి గౌరవప్రదంగా తుదివీడ్కోలు పలికారు. ఈ సంఘటనతో అక్కడున్న ప్రజలు పోలీసుల సేవాభావాన్ని అభినందించగా, విధి నిర్వహణతో పాటు మానవీయ విలువలను కాపాడుతున్న పోలీసు సిబ్బందిపై ప్రశంసలు కురిపించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News