రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జహీరాబాద్ రూరల్ పోలీసు స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ మాసాని వెంకటరాములు అంత్యక్రియలకు జహీరాబాద్ సబ్ డివిజన్ పోలీస్ శాఖ సిబ్బంది నారాయణఖేడ్ పట్టణంలో హాజరై మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారి బాధను పంచుకున్నారు. అంత్యక్రియల సందర్భంగా ప్రజల సేవలో ఎల్లప్పుడూ ముందుండే పోలీసులు మరోసారి తమ మానవత్వాన్ని చాటిచెప్పారు. స్థానికంగా నిర్వహించిన అంతిమయాత్రలో పోలీసు సిబ్బంది స్వయంగా పాడె మోసి చివరి యాత్రలో పాల్గొని మృతునికి గౌరవప్రదంగా తుదివీడ్కోలు పలికారు. ఈ సంఘటనతో అక్కడున్న ప్రజలు పోలీసుల సేవాభావాన్ని అభినందించగా, విధి నిర్వహణతో పాటు మానవీయ విలువలను కాపాడుతున్న పోలీసు సిబ్బందిపై ప్రశంసలు కురిపించారు.
PRINT TIME: August 07, 2026 01:11 AM
విధి మాత్రమే కాదు… మానవత్వంలోనూ ముందున్న పోలీసులు
విధి మాత్రమే కాదు… మానవత్వంలోనూ ముందున్న పోలీసులు
25-04-2026
506 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జహీరాబాద్ రూరల్ పోలీసు స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ మాసాని వెంకటరాములు అంత్యక్రియలకు జహీరాబాద్ సబ్ డివిజన్ పోలీస్ శాఖ సిబ్బంది నారాయణఖేడ్ పట్టణంలో హాజరై మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారి బాధను పంచుకున్నారు. అంత్యక్రియల సందర్భంగా ప్రజల సేవలో ఎల్లప్పుడూ ముందుండే పోలీసులు మరోసారి తమ మానవత్వాన్ని చాటిచెప్పారు. స్థానికంగా నిర్వహించిన అంతిమయాత్రలో పోలీసు సిబ్బంది స్వయంగా పాడె మోసి చివరి యాత్రలో పాల్గొని మృతునికి గౌరవప్రదంగా తుదివీడ్కోలు పలికారు. ఈ సంఘటనతో అక్కడున్న ప్రజలు పోలీసుల సేవాభావాన్ని అభినందించగా, విధి నిర్వహణతో పాటు మానవీయ విలువలను కాపాడుతున్న పోలీసు సిబ్బందిపై ప్రశంసలు కురిపించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి