Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రతి ఇంటికి రోజూ రెండు గంటల మంజీరా నీరు లక్ష్యం పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 09:16 PM

విధి మాత్రమే కాదు… మానవత్వంలోనూ ముందున్న పోలీసులు

విధి మాత్రమే కాదు… మానవత్వంలోనూ ముందున్న పోలీసులు

విధి మాత్రమే కాదు… మానవత్వంలోనూ ముందున్న పోలీసులు
April 25, 2026 06:56 PM 264 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జహీరాబాద్ రూరల్ పోలీసు స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ మాసాని వెంకటరాములు అంత్యక్రియలకు జహీరాబాద్ సబ్ డివిజన్ పోలీస్ శాఖ సిబ్బంది నారాయణఖేడ్ పట్టణంలో హాజరై మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారి బాధను పంచుకున్నారు. అంత్యక్రియల సందర్భంగా ప్రజల సేవలో ఎల్లప్పుడూ ముందుండే పోలీసులు మరోసారి తమ మానవత్వాన్ని చాటిచెప్పారు. స్థానికంగా నిర్వహించిన అంతిమయాత్రలో పోలీసు సిబ్బంది స్వయంగా పాడె మోసి చివరి యాత్రలో పాల్గొని మృతునికి గౌరవప్రదంగా తుదివీడ్కోలు పలికారు. ఈ సంఘటనతో అక్కడున్న ప్రజలు పోలీసుల సేవాభావాన్ని అభినందించగా, విధి నిర్వహణతో పాటు మానవీయ విలువలను కాపాడుతున్న పోలీసు సిబ్బందిపై ప్రశంసలు కురిపించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News