విజయం తర్వాత అభివృద్ధికి హామీ – చిల్లపల్లి రుక్మిణీ నేతృత్వం
విజయం తర్వాత అభివృద్ధికి హామీ – చిల్లపల్లి రుక్మిణీ నేతృత్వం
Sthanikam joint District Staff Reporter krishna
నారాయణఖేడ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 11వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి చిల్లపల్లి రుక్మిణీ 7 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. సమీప బీఆర్ఎస్ అభ్యర్థిపై సాధించిన ఈ విజయం తక్కువ తేడా అయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో, కార్యకర్తలలో, అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది.ఫలితాలు వెలువడగానే పార్టీ కార్యకర్తలు బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచి ఘన సంబరాలు నిర్వహించారు. ప్రజలు కూడా విజయాన్ని హృదయపూర్వకంగా స్వీకరించి అభినందనలు తెలిపారు. చిల్లపల్లి రుక్మిణీ తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రతి ఓటరికి, పార్టీయే కార్యకర్తలకు మరియు వార్డు ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.విజయం తర్వాత మాట్లాడుతూ, 11వ వార్డు అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని చిల్లపల్లి రుక్మిణీ స్పష్టం చేశారు. తాగునీటి సరఫరా, రహదారుల మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాటు, పారిశుధ్యం, ఇతర ప్రాథమిక సౌకర్యాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. అలాగే, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేసి, వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దే కృషి చేస్తానని హామీ ఇచ్చారు.చిల్లపల్లి రుక్మిణీ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలను కల్పిస్తారని, ప్రజల సహకారం ఉంటే వార్డులో స్పష్టమైన మార్పులు తీసుకురావచ్చని చెప్పారు. ఈ ఘన విజయంతో కాంగ్రెస్ పార్టీకి స్థానిక రాజకీయాల్లో మరింత బలం చేకూరిందని పార్టీ నేతలు పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి