Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఏబీవీపీ ఆధ్వర్యంలో చౌటుప్పల్‌లో విద్యాసంస్థల బంద్ సక్సెస్! కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 09:59 AM

వేమిరెడ్డిపల్లి–పుట్రేల రహదారి దుస్థితి: సీపీఎం ఆధ్వర్యంలో రోడ్డుదిగ్బంధం

వేమిరెడ్డిపల్లి–పుట్రేల రహదారి దుస్థితి: సీపీఎం ఆధ్వర్యంలో రోడ్డుదిగ్బంధం

వేమిరెడ్డిపల్లి–పుట్రేల రహదారి దుస్థితి: సీపీఎం ఆధ్వర్యంలో రోడ్డుదిగ్బంధం
February 28, 2026 08:10 PM 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం వేమిరెడ్డిపల్లి నుంచి పుట్రేల గ్రామానికి వెళ్లే ప్రధాన తారు రహదారి దారుణ స్థితికి చేరడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం (సీపీఎం) నాయకుల ఆధ్వర్యంలో రోడ్డుదిగ్బంధం చేసి నిరసన కార్యక్రమం నిర్వహించారు.

గ్రామస్తుల కథనం ప్రకారం, గత 30 ఏళ్లుగా వేమిరెడ్డిపల్లి–పుట్రేల మధ్య తారు రహదారి ఉన్నప్పటికీ, ఇటీవల కాలంలో పూర్తిగా గుంతలమయమై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వాహనదారులు ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం మరమ్మత్తులు చేస్తామని కొలతలు వేసినా పనులు ప్రారంభం కాలేదని సీపీఎం మండల కార్యదర్శి నాగరాజు ఆరోపించారు. వేమిరెడ్డిపల్లి బొడ్రాయి నుంచి పుట్రేల వరకు తారు రహదారిని తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. గతంలో భారీ వాహనాలు సంచరించడం వల్ల రహదారి పూర్తిగా దెబ్బతిందని తెలిపారు.

ఏడు గ్రామాల కలయికగా ఉన్న వేమిరెడ్డిపల్లి నుంచి బయటకు వెళ్లాలంటే ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని, ప్రమాదాల నివారణ కోసం ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించి మరమ్మత్తులు చేపట్టాలని నాయకులు కోరారు.

ఈ నిరసనలో సీపీఎం నాయకులు మోరంపూడి రామారావు, కరెడ్ల ధనలక్ష్మి, గ్రామస్తులు మోరంపూడి కోటేశ్వరరావు, చెన్నారావు, ఆదం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News