వేమిరెడ్డిపల్లి–పుట్రేల రహదారి దుస్థితి: సీపీఎం ఆధ్వర్యంలో రోడ్డుదిగ్బంధం
వేమిరెడ్డిపల్లి–పుట్రేల రహదారి దుస్థితి: సీపీఎం ఆధ్వర్యంలో రోడ్డుదిగ్బంధం
GADDAM JAGANMOHAN REDDY
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం వేమిరెడ్డిపల్లి నుంచి పుట్రేల గ్రామానికి వెళ్లే ప్రధాన తారు రహదారి దారుణ స్థితికి చేరడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం (సీపీఎం) నాయకుల ఆధ్వర్యంలో రోడ్డుదిగ్బంధం చేసి నిరసన కార్యక్రమం నిర్వహించారు.
గ్రామస్తుల కథనం ప్రకారం, గత 30 ఏళ్లుగా వేమిరెడ్డిపల్లి–పుట్రేల మధ్య తారు రహదారి ఉన్నప్పటికీ, ఇటీవల కాలంలో పూర్తిగా గుంతలమయమై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వాహనదారులు ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం మరమ్మత్తులు చేస్తామని కొలతలు వేసినా పనులు ప్రారంభం కాలేదని సీపీఎం మండల కార్యదర్శి నాగరాజు ఆరోపించారు. వేమిరెడ్డిపల్లి బొడ్రాయి నుంచి పుట్రేల వరకు తారు రహదారిని తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. గతంలో భారీ వాహనాలు సంచరించడం వల్ల రహదారి పూర్తిగా దెబ్బతిందని తెలిపారు.
ఏడు గ్రామాల కలయికగా ఉన్న వేమిరెడ్డిపల్లి నుంచి బయటకు వెళ్లాలంటే ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని, ప్రమాదాల నివారణ కోసం ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించి మరమ్మత్తులు చేపట్టాలని నాయకులు కోరారు.
ఈ నిరసనలో సీపీఎం నాయకులు మోరంపూడి రామారావు, కరెడ్ల ధనలక్ష్మి, గ్రామస్తులు మోరంపూడి కోటేశ్వరరావు, చెన్నారావు, ఆదం తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి