Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హరీష్ రావును కలిసిన ఉద్యమ నేత ఎస్.కె. చాంద్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా కీలక ముందడుగు కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు – ప్రతిభావంతుల సత్కారం డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 08, 2026 12:22 AM

వ్యవసాయంలో యాంత్రీకరణకు వేగం పెంచాలి – కలెక్టర్ సూచనలు

వ్యవసాయంలో యాంత్రీకరణకు వేగం పెంచాలి – కలెక్టర్ సూచనలు

వ్యవసాయంలో యాంత్రీకరణకు వేగం పెంచాలి – కలెక్టర్ సూచనలు
March 23, 2026 02:44 PM 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

వ్యవసాయ యాంత్రీకరణతో రైతుల ఆదాయం పెంపు లక్ష్యంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కీలక సూచనలు చేశారు.యాంత్రీకరణ, వర్షాధార ప్రాంతాల అభివృద్ధి, తేనెటీగల పెంపకం పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తే రైతులకు అధిక లాభాలు అందుతాయని తెలిపారు.సోమవారం కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ, ఉద్యానవన, గ్రామీణ అభివృద్ధి శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన యాంత్రీకరణ లక్ష్యాలను వేగంగా పూర్తి చేయాలని, ఇప్పటివరకు సాధించిన పురోగతికి సంబంధించిన వినియోగ ధ్రువపత్రాలను వెంటనే సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనులు జరిగేలా పర్యవేక్షణ పెంచాలని సూచించారు.రైతులను యాంత్రీకరణ వైపు ప్రోత్సహించడం ద్వారా కూలి ఖర్చులు తగ్గి, వ్యవసాయ పనులు వేగంగా పూర్తవుతాయని,ఉత్పాదకత పెరుగుతుందని పేర్కొన్నారు. ఉద్యాన యాంత్రీకరణ పథకం ద్వారా చిన్న ట్రాక్టర్లు,గడ్డి తొలగించే యంత్రాలు, నేల దున్నే యంత్రాలు,చెట్లు కత్తిరించే పరికరాలు,మందులు పిచికారీ చేసే యంత్రాల కొనుగోలుకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని, జిల్లాలో ఇప్పటికే 97 యూనిట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.వర్షాధార ప్రాంతాల అభివృద్ధి పథకం ద్వారా నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించడమే లక్ష్యమని వివరించారు.ఈ పథకం కింద పంటల విభిన్నీకరణ,పశుపోషణ,

ఉద్యానవనం వంటి సమగ్ర వ్యవసాయ విధానాలను అమలు చేయాలని సూచించారు.సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని తెలిపారు.తేనెటీగల పెంపకం కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని వివరించారు.ఎక్కువ మంది రైతులకు తేనెటీగల పెట్టెలు అందేలా చర్యలు తీసుకోవాలని,ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల మహిళలను ఇందిరా మహిళా శక్తి పథకం కింద ప్రోత్సహించాలని గ్రామీణ అభివృద్ధి అధికారులకు సూచించారు.వాణిజ్య స్థాయిలో తేనె ఉత్పత్తి చేసే కేంద్రాలు ఏర్పాటు చేస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని తెలిపారు.ఈ సమావేశంలో గ్రామీణ అభివృద్ధి అదనపు కార్యదర్శి సూర్యరావు, ఉద్యానవన శాఖ అధికారి సోమేశ్వరరావు,జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్,ఎస్సీ సంస్థ అధికారి రామాచారి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News