వాసవీ మాత జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం అభినందనీయం:మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్
వాసవీ మాత జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం అభినందనీయం:మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని మున్సిపల్ సాయిబాబా మందిరంలో ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ హాజరై పూర్ణకుంభ స్వాగతం స్వీకరించి వాసవీ మాత చిత్రపటానికి పూజలు నిర్వహించి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఆర్యవైశ్యుల చిరకాల కోరికను నెరవేర్చుతూ వాసవీ మాత జయంతిని అధికారిక రాష్ట్ర పండుగగా ప్రకటించడం అభినందనీయమన్నారు. ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల పక్ష దశమి రోజున ప్రభుత్వ లాంఛనాలతో ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వాసవీ మాత చూపిన అహింసా మార్గం, ధర్మబోధలు సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు వివేకానంద, మహేందర్, లక్ష్మణ్, మాణిక్ ప్రభు, సత్యం షెట్, బద్రి షెట్, నవతా నర్సింలు, నారాయణ షెట్, సతీష్, పాండు మహేష్ షెట్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి