Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 23, 2026 02:40 AM

వక్ఫ్ బోర్డు చైర్మన్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన నారాయణఖేడ్ నేతలు

వక్ఫ్ బోర్డు చైర్మన్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన నారాయణఖేడ్ నేతలు

వక్ఫ్ బోర్డు చైర్మన్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన నారాయణఖేడ్ నేతలు
March 23, 2026 12:49 AM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిరిసిల్ల జిల్లాలోని గంబీర్ రావుపేట్ మండలానికి చెందిన తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్ గారి స్వగ్రామంలోని వారి నివాసానికి ప్రత్యేకంగా వెళ్లి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రంజాన్ పర్వదినం యొక్క ప్రాముఖ్యత, సామరస్య భావం, సోదరభావం గురించి పరస్పరం చర్చించుకున్నారు. సమాజంలో ఐక్యత, శాంతి, పరస్పర గౌరవం పెంపొందాలని నాయకులు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు సంగన్న న్యాయవాది, పండరి రెడ్డి, ముంతాజ్ సెట్ (మాజీ ఎంపీటీసీలు), విఠల్ రావు పాటిల్ (మాజీ సర్పంచ్), రుక్మిణి గోపాల్ రెడ్డి, షారుఖాన్ (మున్సిపల్ కౌన్సిలర్), హమ్మా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.వారు అందరూ కలిసి సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పండుగ శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు,రంజాన్ పర్వదినం శాంతి,సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలవాలని కోరుకున్నారు.ఈ సందర్శనతో నాయకుల మధ్య సాన్నిహిత్యం మరింత బలపడింది. ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించేందుకు ఇటువంటి పరస్పర సందర్శనలు ఎంతో ఉపయోగకరమని వారు అభిప్రాయపడ్డారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News