వై. పండరి ఆధ్వర్యంలో అవదత్ పూర్లో మహిళలకై ప్రత్యేకంగా ఏర్పాటైన వేడుక
వై. పండరి ఆధ్వర్యంలో అవదత్ పూర్లో మహిళలకై ప్రత్యేకంగా ఏర్పాటైన వేడుక
Sthanikam joint District Staff Reporter krishna
నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని నాగల్గిద్ది మండలం అవదత్ పూర్ గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్, సోషల్ జస్టిస్ మరియు సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండరి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. గ్రామంలోని మహిళల సాధికారత, వారి సేవలను గౌరవించడం మరియు సమాజంలో మహిళల పాత్రను గుర్తు చేసుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా గ్రామ మహిళా సమాఖ్య కార్యదర్శి వై. విమల, 10వ వార్డు సభ్యురాలు బి. అక్షిత, గ్రామ సీనియర్ మహిళలు నర్సమ్మ, ఈరమ్మ తదితర మహిళలను శాలువాలతో సన్మానించి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు కుటుంబం, సమాజం అభివృద్ధిలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని, మహిళల ప్రగతితోనే సమాజం ముందుకు సాగుతుందని వక్తలు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యుస్సుబ్, రాజు స్వామి, సుందర్, గ్రామ మహిళా సమాఖ్య వీఓఏ జీతప్ప, గ్రామ పంచాయతీ కార్మికుడు గణపతి మరియు గ్రామానికి చెందిన పలువురు మహిళలు, యువకులు, గ్రామస్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి