PRINT TIME: April 24, 2026 10:26 PM
ఉపాధి కూలీల మధ్య బడిబాట – విద్యకు ప్రాధాన్యత పెంపు
ఉపాధి కూలీల మధ్య బడిబాట – విద్యకు ప్రాధాన్యత పెంపు
April 24, 2026 08:35 PM
24 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం శంషుద్దీన్పూర్ గ్రామంలో సర్పంచ్ నవీన్ కుమార్ ఉపాధి హామీ కూలీల పని ప్రదేశానికి వెళ్లి బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయుల సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులకు విద్య ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత గల ఉపాధ్యాయులు ఉన్నారని, పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వ స్కూళ్లలోనే చేర్పించాలని సర్పంచ్ సూచించారు. ప్రైవేట్ పాఠశాలలపై మాత్రమే ఆధారపడకుండా మంచి విద్య కోసం సరైన నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ఉపాధ్యాయులు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి