ఉమ సంగమేశ్వర స్వామి సన్నిధిలో ఎమ్మెల్యే ప్రత్యేక అభిషేకాలు
ఉమ సంగమేశ్వర స్వామి సన్నిధిలో ఎమ్మెల్యే ప్రత్యేక అభిషేకాలు
Sthanikam joint District Staff Reporter krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని శంకరంపేట్ మండల పరిధిలో ప్రసిద్ధి చెందిన కొప్పోల్ ఉమ సంగమేశ్వర దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా విశేష వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా నారాయణఖేడ్ శాసనసభ్యుడు డాక్టర్ పి సంజీవరెడ్డి ఆలయాన్ని సందర్శించి ఉమ సంగమేశ్వర స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు.అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు త్రాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సదుపాయాలు కల్పించాలని సంబంధిత వారికి సూచించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, భక్తులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శివరాత్రి సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు రాత్రంతా జాగరణ చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తులకు ప్రత్యేక అనుభూతిని కలిగించింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి