Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 03:16 AM

ఉమ సంగమేశ్వర స్వామి సన్నిధిలో ఎమ్మెల్యే ప్రత్యేక అభిషేకాలు

ఉమ సంగమేశ్వర స్వామి సన్నిధిలో ఎమ్మెల్యే ప్రత్యేక అభిషేకాలు

ఉమ సంగమేశ్వర స్వామి సన్నిధిలో ఎమ్మెల్యే ప్రత్యేక అభిషేకాలు
15-02-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని శంకరంపేట్ మండల పరిధిలో ప్రసిద్ధి చెందిన కొప్పోల్ ఉమ సంగమేశ్వర దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా విశేష వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా నారాయణఖేడ్ శాసనసభ్యుడు డాక్టర్ పి సంజీవరెడ్డి ఆలయాన్ని సందర్శించి ఉమ సంగమేశ్వర స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు.అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు త్రాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సదుపాయాలు కల్పించాలని సంబంధిత వారికి సూచించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, భక్తులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శివరాత్రి సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు రాత్రంతా జాగరణ చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తులకు ప్రత్యేక అనుభూతిని కలిగించింది.

Sthanikam

ఉమ సంగమేశ్వర స్వామి సన్నిధిలో ఎమ్మెల్యే ప్రత్యేక అభిషేకాలు

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని శంకరంపేట్ మండల పరిధిలో ప్రసిద్ధి చెందిన కొప్పోల్ ఉమ సంగమేశ్వర దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా విశేష వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా నారాయణఖేడ్ శాసనసభ్యుడు డాక్టర్ పి సంజీవరెడ్డి ఆలయాన్ని సందర్శించి ఉమ సంగమేశ్వర స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు.అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు త్రాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సదుపాయాలు కల్పించాలని సంబంధిత వారికి సూచించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, భక్తులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శివరాత్రి సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు రాత్రంతా జాగరణ చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తులకు ప్రత్యేక అనుభూతిని కలిగించింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News