ఉగాది సందర్బంగా నల్లపోచమ్మ సన్నిధిలో షడ్రుచుల పచ్చడి పంపిణీ
ఉగాది సందర్బంగా నల్లపోచమ్మ సన్నిధిలో షడ్రుచుల పచ్చడి పంపిణీ
Sthanikam joint District Staff Reporter krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం బోరంచ గ్రామ శివారులో, మంజీర నది ఒడ్డున ఉన్న ప్రసిద్ధి చెందిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయంలో గురువారం భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సిద్దు స్వామి, ప్రవీణ్ స్వామి ఆధ్వర్యంలో పంచామృతాలు, గంగాజలంతో అభిషేకాలు నిర్వహించి, కుంకుమార్చన పూజలు చేశారు.అనంతరం అమ్మవారికి నుదుట పసుపు, కుంకుమ తిలకం దిద్ది, పట్టువస్త్రాలు సమర్పించారు. వివిధ రకాల సుగంధ పుష్పాలతో అలంకరించి ఆలయాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు.తరువాత అమ్మవారికి హారతులు సమర్పించి, నైవేద్యం నివేదించారు.ఉగాది పండుగను పురస్కరించుకుని అమ్మవారి సన్నిధిలో షడ్రుచులతో ఉగాది పచ్చడి తయారు చేసి భక్తులకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని,తమ కుటుంబాల శ్రేయస్సు,ఆరోగ్యం,ఐశ్వర్యం కోసం ప్రార్థనలు చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామస్తులు యువత యువకులు వివిధ గ్రామాల చెందిన భక్తులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి