Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాళేశ్వరం పై కక్షసాధింపుకు బ్రేక్ – హైకోర్టు స్టేతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 04:18 AM

ఉద్యమకారులకు న్యాయం చేస్తాం: ఎమ్మెల్యే వేముల రామన్నపేటలో ఫోరం కమిటీ కృతజ్ఞతలు

ఉద్యమకారులకు న్యాయం చేస్తాం: ఎమ్మెల్యే వేముల రామన్నపేటలో ఫోరం కమిటీ కృతజ్ఞతలు

ఉద్యమకారులకు న్యాయం చేస్తాం: ఎమ్మెల్యే వేముల రామన్నపేటలో ఫోరం కమిటీ కృతజ్ఞతలు
March 01, 2026 12:22 PM 231 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడం హర్షణీయమని రామన్నపేట మండల తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కమిటీ పేర్కొంది. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశంను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన ప్రకటన ఉద్యమకారుల్లో నూతన ఆశలు నింపిందని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వివరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యేను సాలువాతో సత్కరించి వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి 250 చదరపు గజాల స్థలం, నెలకు రూ.25 వేల పింఛన్, గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని కోరారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి ఉద్యమకారులకు తగిన న్యాయం చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు ఫోరం ప్రతినిధులు తెలిపారు. అమరుల కుటుంబాలకు కూడా న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నోముల శంకర్, రాష్ట్ర నాయకులు రెబ్బాసు రాములు, బొడ్డుపల్లి లింగన్న, డాక్టర్ నకిరేకంటి అశోక్ కుమార్, గడ్డం యాదగిరి, నక్క శంకరయ్య, మందడి రవీందర్ రెడ్డి, ఏలూరు రవి, హరికృష్ణ, బెడుదలింగం నరసింహ, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News