Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:49 PM

ఉద్యమకారులకు న్యాయం చేస్తాం: ఎమ్మెల్యే వేముల రామన్నపేటలో ఫోరం కమిటీ కృతజ్ఞతలు

ఉద్యమకారులకు న్యాయం చేస్తాం: ఎమ్మెల్యే వేముల రామన్నపేటలో ఫోరం కమిటీ కృతజ్ఞతలు

ఉద్యమకారులకు న్యాయం చేస్తాం: ఎమ్మెల్యే వేముల రామన్నపేటలో ఫోరం కమిటీ కృతజ్ఞతలు
01-03-2026 239 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడం హర్షణీయమని రామన్నపేట మండల తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కమిటీ పేర్కొంది. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశంను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన ప్రకటన ఉద్యమకారుల్లో నూతన ఆశలు నింపిందని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వివరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యేను సాలువాతో సత్కరించి వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి 250 చదరపు గజాల స్థలం, నెలకు రూ.25 వేల పింఛన్, గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని కోరారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి ఉద్యమకారులకు తగిన న్యాయం చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు ఫోరం ప్రతినిధులు తెలిపారు. అమరుల కుటుంబాలకు కూడా న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నోముల శంకర్, రాష్ట్ర నాయకులు రెబ్బాసు రాములు, బొడ్డుపల్లి లింగన్న, డాక్టర్ నకిరేకంటి అశోక్ కుమార్, గడ్డం యాదగిరి, నక్క శంకరయ్య, మందడి రవీందర్ రెడ్డి, ఏలూరు రవి, హరికృష్ణ, బెడుదలింగం నరసింహ, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉద్యమకారులకు న్యాయం చేస్తాం: ఎమ్మెల్యే వేముల రామన్నపేటలో ఫోరం కమిటీ కృతజ్ఞతలు

Article Image

తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడం హర్షణీయమని రామన్నపేట మండల తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కమిటీ పేర్కొంది. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశంను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన ప్రకటన ఉద్యమకారుల్లో నూతన ఆశలు నింపిందని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వివరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యేను సాలువాతో సత్కరించి వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి 250 చదరపు గజాల స్థలం, నెలకు రూ.25 వేల పింఛన్, గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని కోరారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి ఉద్యమకారులకు తగిన న్యాయం చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు ఫోరం ప్రతినిధులు తెలిపారు. అమరుల కుటుంబాలకు కూడా న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నోముల శంకర్, రాష్ట్ర నాయకులు రెబ్బాసు రాములు, బొడ్డుపల్లి లింగన్న, డాక్టర్ నకిరేకంటి అశోక్ కుమార్, గడ్డం యాదగిరి, నక్క శంకరయ్య, మందడి రవీందర్ రెడ్డి, ఏలూరు రవి, హరికృష్ణ, బెడుదలింగం నరసింహ, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News