నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని తూమ్నూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంజీవ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లు సభ్యులు, గ్రామ పెద్దలు, యువత మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, ఆయన సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలను స్మరించుకున్నారు. విద్యా విస్తరణ, మహిళా సాధికారత, సామాజిక సమానత్వం కోసం పూలే చేసిన కృషి అందరికీ ఆదర్శమని పేర్కొంటూ, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.
PRINT TIME: August 07, 2026 02:18 AM
తూమ్నూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో పూలే జయంతి వేడుకలు
తూమ్నూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో పూలే జయంతి వేడుకలు
11-04-2026
267 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని తూమ్నూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంజీవ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లు సభ్యులు, గ్రామ పెద్దలు, యువత మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, ఆయన సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలను స్మరించుకున్నారు. విద్యా విస్తరణ, మహిళా సాధికారత, సామాజిక సమానత్వం కోసం పూలే చేసిన కృషి అందరికీ ఆదర్శమని పేర్కొంటూ, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి