తొర్నల్ గ్రామ సమస్యల పరిష్కారానికి సర్పంచ్ వినతి
తొర్నల్ గ్రామ సమస్యల పరిష్కారానికి సర్పంచ్ వినతి
Krishna
ప్రజా పాలనా ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు మనూర్ మండల కేంద్రంలో రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో తొర్నల్ గ్రామ సర్పంచ్ సంగమేష్ పటేల్ పాల్గొని గ్రామానికి సంబంధించిన పలు ముఖ్య సమస్యలపై సబ్ కలెక్టర్ ఉమాహరతి కి వినతి పత్రం సమర్పించారు. గ్రామంలో తాగునీటి సమస్య, రోడ్ల మరమ్మత్తులు, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి, వీధి దీపాల ఏర్పాటు, పేదల గృహాల నిర్మాణం వంటి అంశాలను ఆమె దృష్టికి తీసుకువెళ్లి, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరంగా తెలియజేశారు.వెంటనే స్పందించిన సబ్ కలెక్టర్ ఉమాహరతి గ్రామ సమస్యలను సానుకూలంగా పరిగణించి సంబంధిత అధికారులతో చర్చించి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ కార్యక్రమం ద్వారా గ్రామ ప్రజలకు తమ సమస్యలను నేరుగా అధికారుల ముందు ఉంచుకునే అవకాశం కలిగిందని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి