Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 02:07 PM

తొర్నల్ గ్రామ సమస్యల పరిష్కారానికి సర్పంచ్ వినతి

తొర్నల్ గ్రామ సమస్యల పరిష్కారానికి సర్పంచ్ వినతి

తొర్నల్ గ్రామ సమస్యల పరిష్కారానికి సర్పంచ్ వినతి
April 16, 2026 04:37 PM 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రజా పాలనా ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు మనూర్ మండల కేంద్రంలో రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో తొర్నల్ గ్రామ సర్పంచ్ సంగమేష్ పటేల్ పాల్గొని గ్రామానికి సంబంధించిన పలు ముఖ్య సమస్యలపై సబ్ కలెక్టర్ ఉమాహరతి కి వినతి పత్రం సమర్పించారు. గ్రామంలో తాగునీటి సమస్య, రోడ్ల మరమ్మత్తులు, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి, వీధి దీపాల ఏర్పాటు, పేదల గృహాల నిర్మాణం వంటి అంశాలను ఆమె దృష్టికి తీసుకువెళ్లి, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరంగా తెలియజేశారు.వెంటనే స్పందించిన సబ్ కలెక్టర్ ఉమాహరతి గ్రామ సమస్యలను సానుకూలంగా పరిగణించి సంబంధిత అధికారులతో చర్చించి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ కార్యక్రమం ద్వారా గ్రామ ప్రజలకు తమ సమస్యలను నేరుగా అధికారుల ముందు ఉంచుకునే అవకాశం కలిగిందని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News