Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 28, 2026 05:12 PM

తరగతి గదిలోనే భావి భారత శాస్త్రవేత్తలకు పునాదులు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రహత్ ఖానమ్

తరగతి గదిలోనే భావి భారత శాస్త్రవేత్తలకు పునాదులు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రహత్ ఖానమ్

తరగతి గదిలోనే భావి భారత శాస్త్రవేత్తలకు పునాదులు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రహత్ ఖానమ్
February 28, 2026 03:08 PM 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

మండల కేంద్రం, భావి భారత శాస్త్రవేత్తలకు పునాదులు తరగతి గదుల నుంచే వేయాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రహత్ ఖానమ్ అన్నారు. మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ రహత్ ఖానమ్, గ్రామ సర్పంచ్ గరిక సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో విజ్ఞాన శాస్త్రం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో భారతీయ విజ్ఞాన సంపద గొప్పదనాన్ని గుర్తుచేశారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే శాస్త్ర విజ్ఞానంపై ఆసక్తి పెంపొందించుకుని సృజనాత్మకతను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. పాఠ్యాంశాలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రయోగాత్మక అధ్యయనం ద్వారా విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

అనంతరం విద్యార్థులు రూపొందించిన శాస్త్ర నమూనాలు, ప్రయోగాలను పరిశీలించి అభినందించారు. విద్యార్థుల ప్రతిభ ఆకట్టుకుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మోట్ రమేష్, పాఠశాల కరస్పాండెంట్ గంగుల నరేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ బి.యాదగిరి, అకాడమిక్ డైరెక్టర్ జె.వి.ఎన్.ఎస్. మణి, డైరెక్టర్ జెల్ల వెంకటేష్, సైన్స్ ఉపాధ్యాయులు మురళి, మల్లేష్, శ్రావణి, ఎస్.ఉమారాణి, ఏ.మమత, శ్వేత, ఉపాధ్యాయులు రషీద్, ఆలీం, బి.ఉమారాణి, మహాలక్ష్మి, కె.లావణ్య, పునందాస్, కల్పన, వినోద, మాధవి, విజయలక్ష్మి, సంధ్య కరుణ, శైలజ, అనూష, ఫరియా, టి.లావణ్య, రేణుక తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News