Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హమాలి కార్మికుల శ్రమ దోపిడీపై ఆగ్రహం సిఐటియు పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 07:10 AM

తరగతి గదిలోనే భావి భారత శాస్త్రవేత్తలకు పునాదులు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రహత్ ఖానమ్

తరగతి గదిలోనే భావి భారత శాస్త్రవేత్తలకు పునాదులు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రహత్ ఖానమ్

తరగతి గదిలోనే భావి భారత శాస్త్రవేత్తలకు పునాదులు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రహత్ ఖానమ్
February 28, 2026 03:08 PM 51 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మండల కేంద్రం, భావి భారత శాస్త్రవేత్తలకు పునాదులు తరగతి గదుల నుంచే వేయాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రహత్ ఖానమ్ అన్నారు. మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ రహత్ ఖానమ్, గ్రామ సర్పంచ్ గరిక సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో విజ్ఞాన శాస్త్రం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో భారతీయ విజ్ఞాన సంపద గొప్పదనాన్ని గుర్తుచేశారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే శాస్త్ర విజ్ఞానంపై ఆసక్తి పెంపొందించుకుని సృజనాత్మకతను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. పాఠ్యాంశాలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రయోగాత్మక అధ్యయనం ద్వారా విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

అనంతరం విద్యార్థులు రూపొందించిన శాస్త్ర నమూనాలు, ప్రయోగాలను పరిశీలించి అభినందించారు. విద్యార్థుల ప్రతిభ ఆకట్టుకుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మోట్ రమేష్, పాఠశాల కరస్పాండెంట్ గంగుల నరేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ బి.యాదగిరి, అకాడమిక్ డైరెక్టర్ జె.వి.ఎన్.ఎస్. మణి, డైరెక్టర్ జెల్ల వెంకటేష్, సైన్స్ ఉపాధ్యాయులు మురళి, మల్లేష్, శ్రావణి, ఎస్.ఉమారాణి, ఏ.మమత, శ్వేత, ఉపాధ్యాయులు రషీద్, ఆలీం, బి.ఉమారాణి, మహాలక్ష్మి, కె.లావణ్య, పునందాస్, కల్పన, వినోద, మాధవి, విజయలక్ష్మి, సంధ్య కరుణ, శైలజ, అనూష, ఫరియా, టి.లావణ్య, రేణుక తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News