Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రామాల సమగ్ర అభివృద్ధే ధ్యేయం కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 05:25 PM

తల్లిదండ్రులను పట్టించుకోని తనయులు మానవతతో అండగా నిలిచిన కలెక్టర్ అనురాగ్ జయంతి

తల్లిదండ్రులను పట్టించుకోని తనయులు మానవతతో అండగా నిలిచిన కలెక్టర్ అనురాగ్ జయంతి

తల్లిదండ్రులను పట్టించుకోని తనయులు మానవతతో అండగా నిలిచిన కలెక్టర్ అనురాగ్ జయంతి
March 02, 2026 06:32 PM 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం హృదయాన్ని కదిలించే ఘటనకు వేదికైంది. ఇటీవల జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనురాగ్ జయంతి ఓ వృద్ధ దంపతుల జీవితంలో ఆశాకిరణంగా నిలిచారు.

ఆలేరు మండలం కొలనుపాక గ్రామానికి చెందిన ధర్మ సోమిరెడ్డి–రమణమ్మ దంపతులు తమ ఇద్దరు కుమారులు ఆస్తి పంచుకుని తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టి, కుమారులకు పలుమార్లు కౌన్సిలింగ్ నిర్వహించారు. సీనియర్ సిటిజన్ చట్టం–2007 ప్రకారం సబ్‌డివిజన్ ట్రైబ్యునల్ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, వారి వైఖరిలో మార్పు రాలేదు.

దిక్కుతోచని స్థితిలో ఉన్న వృద్ధ దంపతులు సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌ను కలిసి మొరపెట్టుకున్నారు. “మాకు ఎవరూ లేరు… మాకు మీరే దిక్కు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వారి వేదనకు చలించిన కలెక్టర్ వెంటనే స్పందించి, చౌటుప్పల్ మండలం పెద్దకొండూరులోని వయోవృద్ధుల ఆశ్రమంలో చేర్పించి ఆశ్రయం కల్పించారు.

వృద్ధుల సమస్యలను నిర్లక్ష్యం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ఈ ఘటన జిల్లాలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారికి గట్టి హెచ్చరికగా మారింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News