Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రజలను మోసం చేస్తే ప్రభుత్వాన్ని నిలదీస్తాం పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 09:11 PM

తల్లిదండ్రులను పట్టించుకోని తనయులు....

తల్లిదండ్రులను పట్టించుకోని తనయులు....

తల్లిదండ్రులను పట్టించుకోని తనయులు....
March 02, 2026 06:45 PM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ఆదరించి ఆశ్రమంలో చేర్పించిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి....

యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన అనురాగ్ జయంతి సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.కన్న కొడుకులు నిర్లక్ష్యంతో తల్లిదండ్రుల బాగోగులు పట్టించు కోకపోవడంతో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి కి వృద్ధ దంపతులు మొరపెట్టుకున్నారు. మానవతా హృదయంతో చలించిపోయిన కలెక్టర్ ఆ వృద్ధ దంపతులను ఆదరించి, వయోవృద్ధుల ఆశ్రమంలో చేర్పించారు. వివరాల్లోకి వెళితే ఆలేరు మండలం కొలనుపాక గ్రామానికి చెందిన ధర్మ సోమిరెడ్డి రమణమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని పంచుకొని,వారిని నిర్లక్ష్యం చేయడంతో గత సంవత్సరం డిసెంబర్ నెలలో జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేశారు. మరుసటి రోజే భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి గ్రామానికి విచారణకు వెళ్ళి,పూర్తి వివరాలు సేకరించారు. వృద్ధ దంపతుల కుమారులైన ధర్మ వెంకట నరసింహ రెడ్డి,ధర్మ గోవర్దన్ రెడ్డి లను పలుమార్లు ఆర్డీఓ కార్యాలయం లో కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం భువనగిరి ఆర్డీవో,సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 ప్రకారం సబ్ డివిజన్ ట్రిబ్యునల్, వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్,రాజస్వ మండలాధికారి భువనగిరి గారి ఉత్తర్వు 2647/2025,తేదీ 27-01-2026 నాడు జడ్జిమెంట్ ఆర్డర్ పంపించారు. అయినా ఆ కుమారులు మారలేదు, ఆర్డీఓ ఆర్డర్ ను బేఖాతరు చేసారు. దిక్కుతోచని ఆ వృద్ధ దంపతులు అప్పిలేట్ అధికారి అయిన జిల్లా కలెక్టర్ ను సోమవారం ప్రజావాణిలో కలిసి మొరపెట్టుకున్నారు. మాకు ఎవరూ లేరు. మాకు మీరే దిక్కు, మమ్మల్ని అనాధాశ్రమంలో చేర్పించండి అంటూ ప్రాధేయపడ్డాడు. దీంతో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆ వృద్ధ దంపతులకు అండగా నిలిచారు.చౌటుప్పల్ మండలం పెద్ద కొండూరు లోని వయోవృద్ధుల ఆశ్రమంలో చేర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో తల్లిదండ్రుల బాగోగులు చూడకుండా నిర్లక్ష్యం చేసే కొడుకులకు ఈ సంఘటన కనువిప్పు కలుగాలని ఆశిద్దాం.....

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News