Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఏబీవీపీ ఆధ్వర్యంలో చౌటుప్పల్‌లో విద్యాసంస్థల బంద్ సక్సెస్! కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 09:10 AM

ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి రాగి వైర్ చోరీ

ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి రాగి వైర్ చోరీ

ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి రాగి వైర్ చోరీ
February 28, 2026 06:47 PM 86 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం యర్రంపల్లి గ్రామంలో రైతుకు చెందిన ట్రాన్స్ఫార్మర్‌ను పగలగొట్టి రాగి వైర్లు అపహరించిన ఘటన శుక్రవారం రాత్రి వెలుగులోకి వచ్చింది.

బాధిత రైతు జగ్గవరపు పిచ్చిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, గ్రామ పరిధిలోని రేగులకుంట కట్టకింద ఉన్న తన వ్యవసాయ పొలంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్‌ను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసి అందులోని రాగి వైర్లు తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.

ఈ ఘటనతో పంటలకు నీటి సరఫరా నిలిచిపోయిందని, భారీ నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న స్థానిక విద్యుత్ శాఖ అధికారులు, పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

గ్రామ పరిసరాల్లో ఇటీవల ఇటువంటి చోరీలు పెరుగుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పహారా పెంచాలని వారు పోలీసులను కోరుతున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News