ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి రాగి వైర్ చోరీ
ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి రాగి వైర్ చోరీ
GADDAM JAGANMOHAN REDDY
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం యర్రంపల్లి గ్రామంలో రైతుకు చెందిన ట్రాన్స్ఫార్మర్ను పగలగొట్టి రాగి వైర్లు అపహరించిన ఘటన శుక్రవారం రాత్రి వెలుగులోకి వచ్చింది.
బాధిత రైతు జగ్గవరపు పిచ్చిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, గ్రామ పరిధిలోని రేగులకుంట కట్టకింద ఉన్న తన వ్యవసాయ పొలంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసి అందులోని రాగి వైర్లు తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.
ఈ ఘటనతో పంటలకు నీటి సరఫరా నిలిచిపోయిందని, భారీ నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న స్థానిక విద్యుత్ శాఖ అధికారులు, పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
గ్రామ పరిసరాల్లో ఇటీవల ఇటువంటి చోరీలు పెరుగుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పహారా పెంచాలని వారు పోలీసులను కోరుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి