Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాళేశ్వరం పై కక్షసాధింపుకు బ్రేక్ – హైకోర్టు స్టేతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 04:11 AM

ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి రాగి వైర్ చోరీ

ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి రాగి వైర్ చోరీ

ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి రాగి వైర్ చోరీ
February 28, 2026 06:47 PM 80 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం యర్రంపల్లి గ్రామంలో రైతుకు చెందిన ట్రాన్స్ఫార్మర్‌ను పగలగొట్టి రాగి వైర్లు అపహరించిన ఘటన శుక్రవారం రాత్రి వెలుగులోకి వచ్చింది.

బాధిత రైతు జగ్గవరపు పిచ్చిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, గ్రామ పరిధిలోని రేగులకుంట కట్టకింద ఉన్న తన వ్యవసాయ పొలంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్‌ను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసి అందులోని రాగి వైర్లు తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.

ఈ ఘటనతో పంటలకు నీటి సరఫరా నిలిచిపోయిందని, భారీ నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న స్థానిక విద్యుత్ శాఖ అధికారులు, పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

గ్రామ పరిసరాల్లో ఇటీవల ఇటువంటి చోరీలు పెరుగుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పహారా పెంచాలని వారు పోలీసులను కోరుతున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News