PRINT TIME: March 01, 2026 01:51 PM
సోమవారం ఎమ్మెల్యే వేముల పర్యటన మండలంలో అభివృద్ధి పనులకు నాంది.
సోమవారం ఎమ్మెల్యే వేముల పర్యటన మండలంలో అభివృద్ధి పనులకు నాంది.
March 01, 2026 12:37 PM
100 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
రామన్నపేట, మండలంలోని పలు గ్రామాల్లో మహిళా సంఘాల భవనాల ప్రారంభోత్సవం, సీసీ రోడ్ల నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమాలకు ఎమ్మెల్యే వేముల వీరేశం సోమవారం (02-03-2026) హాజరుకానున్నారు.
పర్యటనలో భాగంగా ఉదయం 9 గంటలకు జనంపల్లిలో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అనంతరం 9.30 గంటలకు నీర్నెముల, 10 గంటలకు నిధనపల్లి, 10.30 గంటలకు కొమ్మయిగూడెం, 11 గంటలకు రామన్నపేటలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు.
తదుపరి రామన్నపేట ఏరియా ఆసుపత్రిలో హెచ్డీసీ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాలకు ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన విభాగం సభ్యులు, అభిమానులు, మీడియా ప్రతినిధులు హాజరుకావాలని రామన్నపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి