Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తై-బజార్‌పై అబద్ధపు ప్రచారాలు మానుకోవాలి: గుమిడెల్లి రమేష్ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 06:22 PM

సోలార్ లైటింగ్ వ్యవస్థను పరిశీలించిన మంత్రి సవిత

సోలార్ లైటింగ్ వ్యవస్థను పరిశీలించిన మంత్రి సవిత

సోలార్ లైటింగ్ వ్యవస్థను పరిశీలించిన మంత్రి సవిత
March 03, 2026 10:36 AM 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా లోని పెనుకొండ పట్టణంలో ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన సోలార్ లైటింగ్ వ్యవస్థను రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రి శ్రీమతి సవితమ్మ పరిశీలించారు.

పెనుకొండ జూనియర్ కళాశాల మైదానంలో రాత్రివేళ వాకింగ్‌కు వచ్చే పాదచారులకు తగిన వెలుతురు సదుపాయం కల్పించాలని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి సంబంధిత అధికారులతో చర్చించి, మైదానం చుట్టూ సమగ్ర లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయించారు. అనంతరం అక్కడికి వెళ్లి లైటింగ్ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి, వాకింగ్‌కు వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

రాత్రి వేళల్లో వాకింగ్ చేసే వారికి ఈ లైటింగ్ ఎంతో ఉపయోగకరంగా మారిందని పట్టణ వాసులు మంత్రి సవితకు కృతజ్ఞతలు తెలిపారు.

తదుపరి, పెనుకొండ పట్టణంలోని వై జంక్షన్ వరకు ఇటీవల ప్రారంభించిన సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను కూడా మంత్రి పరిశీలించారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా రహదారులపై సమగ్ర వెలుగుల ఏర్పాటు కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఆమె పేర్కొన్నారు.

అనంతరం పట్టణంలోని ఎంఎజేపీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి విద్యార్థులతో ముచ్చటించి, పాఠశాలలో ఉన్న సదుపాయాలు మరియు సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలు సాధించాలని ఆమె ప్రోత్సహించారు.

పట్టణ ప్రజల అవసరాలను గుర్తించి వేగంగా స్పందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి సవిత స్పష్టం చేశారు


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News