సంగారెడ్డిలో ప్రణాం డే కేర్ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి
సంగారెడ్డిలో ప్రణాం డే కేర్ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి
Sthanikam joint District Staff Reporter krishna
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం. వసంతరావు ప్రణాం డే కేర్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చే వృద్ధులతో మాట్లాడి వారికి అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. ఇంకా సేవలను మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించారు. వృద్ధులు ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన వైద్య పరీక్షలు, సౌకర్యాలు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.ఈ సందర్భంగా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు శేషుకర్ మరియు సిబ్బంది వృద్ధులకు రక్తపోటు, మధుమేహ పరీక్షలు నిర్వహించారు. అలాగే సాధారణ ఆరోగ్య పరీక్షలు కూడా చేసి వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. అవసరమైన వారికి ఆరోగ్య సూచనలు మరియు జాగ్రత్తలు తెలియజేశారు.వృద్ధుల ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పరిశీలించేందుకు వారానికి ఒకసారి డే కేర్ కేంద్రాన్ని సందర్శించి వారికి పరీక్షలు నిర్వహించి అవసరమైన సలహాలు ఇవ్వాలని వైద్య అధికారికి సూచించారు.వృద్ధులు ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని కూడా తెలిపారు.ప్రణాం డే కేర్ కేంద్రం ద్వారా వృద్ధులకు మంచి సేవలు అందుతున్నాయని తెలిపారు. ఇంకా ఎక్కువ మంది వృద్ధులు ఈ కేంద్రంలో సభ్యత్వం తీసుకుని అందుతున్న సేవలను వినియోగించుకోవాలని పత్రికాముఖంగా తెలియజేశారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సి. వనజ రెడ్డి, మహిళా అభివృద్ధి శాఖ అధికారి లలిత కుమారి మరియు సిబ్బంది అందరి సేవలను అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి