సంగారెడ్డిలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
సంగారెడ్డిలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
Krishna
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి నియోజకవర్గంలో వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సూచనల మేరకు పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించి తెలంగాణ రాష్ట్ర సాధనలో పార్టీ చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు. అనంతరం పట్టణ కార్యదర్శి నర్సింలు పార్టీ జెండాను ఎగురవేయగా, పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి బీఆర్ఎస్ చేసిన సేవలను నాయకులు గుర్తుచేశారు. కంది జిల్లా పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించగా, నాయకులు, కార్యకర్తలు జై తెలంగాణ – జై బీఆర్ఎస్ నినాదాలతో ఉత్సాహాన్ని ప్రదర్శించారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, యువ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి