Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 01:12 AM

సంగారెడ్డిలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

సంగారెడ్డిలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

సంగారెడ్డిలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
27-04-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి నియోజకవర్గంలో వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సూచనల మేరకు పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించి తెలంగాణ రాష్ట్ర సాధనలో పార్టీ చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు. అనంతరం పట్టణ కార్యదర్శి నర్సింలు పార్టీ జెండాను ఎగురవేయగా, పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి బీఆర్ఎస్ చేసిన సేవలను నాయకులు గుర్తుచేశారు. కంది జిల్లా పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించగా, నాయకులు, కార్యకర్తలు జై తెలంగాణ – జై బీఆర్ఎస్ నినాదాలతో ఉత్సాహాన్ని ప్రదర్శించారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, యువ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

సంగారెడ్డిలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Article Image

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి నియోజకవర్గంలో వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సూచనల మేరకు పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించి తెలంగాణ రాష్ట్ర సాధనలో పార్టీ చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు. అనంతరం పట్టణ కార్యదర్శి నర్సింలు పార్టీ జెండాను ఎగురవేయగా, పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి బీఆర్ఎస్ చేసిన సేవలను నాయకులు గుర్తుచేశారు. కంది జిల్లా పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించగా, నాయకులు, కార్యకర్తలు జై తెలంగాణ – జై బీఆర్ఎస్ నినాదాలతో ఉత్సాహాన్ని ప్రదర్శించారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, యువ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News