Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 12:51 PM

సంగారెడ్డిలో బాలల భద్రత – డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాలు ప్రారంభం

సంగారెడ్డిలో బాలల భద్రత – డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాలు ప్రారంభం

సంగారెడ్డిలో బాలల భద్రత – డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాలు ప్రారంభం
April 27, 2026 08:15 PM 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “బాలల భద్రత – డ్రగ్స్ రహిత తెలంగాణ” వారోత్సవాలు సోమవారం ప్రారంభమై మే 2 వరకు కొనసాగనున్నట్లు అదనపు కలెక్టర్ పాండు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని 08 చైల్డ్ కేర్ సంస్థలలో ఉన్న పిల్లలకు ధృవీకరణ పత్రాల జారీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పిల్లల భవిష్యత్తు దృష్ట్యా వారికి అవసరమైన ప్రభుత్వ పత్రాలు అందించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ, 16 నుంచి 23 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలకు జనన ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు జారీ చేసే ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు. 18 సంవత్సరాలు పూర్తయిన యువతకు డీఆర్‌డీఏ ద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వం పిల్లల సమగ్ర అభివృద్ధికి అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని స్పష్టం చేశారు. జిల్లా సంక్షేమ అధికారిణి లలిత కుమారి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని చైల్డ్ కేర్ సంస్థలలో ఉన్న పిల్లలకు ప్రభుత్వ పర్యవేక్షణలో అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నామని, ప్రతి వారం తనిఖీలు నిర్వహిస్తూ పిల్లల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా 18 సంవత్సరాలు దాటిన 10 మంది పిల్లలకు ఆఫ్టర్ కేర్ సర్టిఫికెట్లు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూసీ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్లు, సీసీఐ ప్రతినిధులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News