సంగారెడ్డిలో బాలల భద్రత – డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాలు ప్రారంభం
సంగారెడ్డిలో బాలల భద్రత – డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాలు ప్రారంభం
Krishna
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “బాలల భద్రత – డ్రగ్స్ రహిత తెలంగాణ” వారోత్సవాలు సోమవారం ప్రారంభమై మే 2 వరకు కొనసాగనున్నట్లు అదనపు కలెక్టర్ పాండు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని 08 చైల్డ్ కేర్ సంస్థలలో ఉన్న పిల్లలకు ధృవీకరణ పత్రాల జారీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పిల్లల భవిష్యత్తు దృష్ట్యా వారికి అవసరమైన ప్రభుత్వ పత్రాలు అందించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ, 16 నుంచి 23 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలకు జనన ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు జారీ చేసే ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు. 18 సంవత్సరాలు పూర్తయిన యువతకు డీఆర్డీఏ ద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వం పిల్లల సమగ్ర అభివృద్ధికి అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని స్పష్టం చేశారు. జిల్లా సంక్షేమ అధికారిణి లలిత కుమారి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని చైల్డ్ కేర్ సంస్థలలో ఉన్న పిల్లలకు ప్రభుత్వ పర్యవేక్షణలో అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నామని, ప్రతి వారం తనిఖీలు నిర్వహిస్తూ పిల్లల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా 18 సంవత్సరాలు దాటిన 10 మంది పిల్లలకు ఆఫ్టర్ కేర్ సర్టిఫికెట్లు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూసీ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్లు, సీసీఐ ప్రతినిధులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి