సంగారెడ్డి–అందోల్ సమస్యలపై కలెక్టర్ను కలిసిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే
సంగారెడ్డి–అందోల్ సమస్యలపై కలెక్టర్ను కలిసిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే
Krishna
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ కలిసి రెండు నియోజకవర్గాలకు సంబంధించిన పలు కీలక సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అందోల్ ప్రాంత రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను చంటి క్రాంతి కిరణ్ వివరించారు. సింగూర్ ప్రాజెక్టు నుంచి నీటి అసమాన పంపిణీ కారణంగా గత రెండున్నర సంవత్సరాలుగా లెఫ్ట్ కాలువ ద్వారా అందోల్ ప్రాంతానికి నీరు అందడం లేదని, దీంతో పుల్కల్, అందోల్ మండలాల్లోని సాగుభూములు పాడుబడుతున్నాయని తెలిపారు. సింగూర్ డ్యామ్లో నీరు ఉన్నప్పటికీ “రిపేర్ పనులు” పేరుతో ఆలస్యం జరుగుతోందని విమర్శించారు. అలాగే ముందస్తు సమాచారం లేకుండా నీరు విడుదల చేయడంతో పోచారం, ముద్దాయిపేట్, పుల్కల్, మిమ్పూర్, ఈసాజీపేట్, గంగోజిపేట్ గ్రామాల్లో వరదలు వచ్చి వందల ఎకరాల పంటలు నష్టపోయాయని, బాధిత రైతులకు ఇప్పటివరకు పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు క్రాప్ హాలిడే లేదా తగిన పరిహారం ఇవ్వడం, కాలువలు–డ్యామ్ మరమ్మతులు వేగవంతం చేయడం, వచ్చే సీజన్ నుంచి సాగునీరు అందేలా చర్యలు తీసుకోవడం, నష్టపోయిన రైతులకు తక్షణ సహాయం అందించాలని కోరారు.ఇక సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గిర్మాపూర్ సాంఘిక సంక్షేమ హాస్టల్లో తాగునీటి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వెంటనే ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరగా, కలెక్టర్ దీనిపై సానుకూలంగా స్పందించారు. అలాగే నియోజకవర్గంలోని పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని త్వరిత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఇద్దరు నేతలు కలెక్టర్ను కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు జైపాల్ రెడ్డి, కాసాల బుచ్చిరెడ్డి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి