సంగారెడ్డి జిల్లాలో నెలరోజుల పాటు 30, 30(ఎ) పోలీసు చట్టం అమలు
సంగారెడ్డి జిల్లాలో నెలరోజుల పాటు 30, 30(ఎ) పోలీసు చట్టం అమలు
Krishna
శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మార్చి 1వ తేదీ నుండి మార్చి 31వ తేదీ వరకు ఒక నెల రోజుల పాటు 30, 30(ఎ) పోలీసు చట్టం–1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు.జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణ ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని, అందుకు అనుగుణంగా ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.ఈ కాలంలో జిల్లాలో ఎవరైనా వ్యక్తులు, ప్రజాప్రతినిధులు లేదా సంఘాల నాయకులు పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ప్రదర్శనలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదు.
ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా ముందుగా సంబంధిత పోలీసు అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలు, ప్రజాధనానికి నష్టం కలిగించే కార్యకలాపాలు, చట్టవిరుద్ధంగా గుంపులుగా కూడడం వంటి వాటిపై కఠిన నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన పక్షంలో సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.జిల్లా ప్రజలు చట్టాలను గౌరవిస్తూ పోలీసు శాఖకు సహకరించి శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు సహాయపడాలని సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి