Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తై-బజార్‌పై అబద్ధపు ప్రచారాలు మానుకోవాలి: గుమిడెల్లి రమేష్ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 06:22 PM

సిరిపురంలో నిరుపేద కుటుంబానికి అండగా గ్రామ నేతలు

సిరిపురంలో నిరుపేద కుటుంబానికి అండగా గ్రామ నేతలు

సిరిపురంలో నిరుపేద కుటుంబానికి అండగా గ్రామ నేతలు
March 03, 2026 12:07 PM 105 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబ పెద్ద నందిపాటి రామలింగం మరణంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి గ్రామ ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు తక్షణ సహాయం అందించారు.

గ్రామ సర్పంచ్ అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి రూ.10 వేల ఆర్థిక సహాయం అందించగా, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బండ శ్రీనివాస్ రెడ్డి 50 కిలోల బియ్యం ఇచ్చారు. 2వ వార్డు సభ్యులు గాదే శంకరయ్య రూ.2 వేల రూపాయలు, ఎంపీటీసీ పున్న వెంకటేశం రూ. 1000 రూపాయలు అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు కూనూరు ముత్తయ్య, అప్పం శ్రీరాములు, పోలెపాక కృష్ణ, గంజి శ్రీనివాస్, కూనూరు లింగస్వామి తదితరులు కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. గ్రామస్థులు కూడా సహాయం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News