PRINT TIME: March 03, 2026 01:38 PM
సిరిపురంలో నిరుపేద కుటుంబానికి అండగా గ్రామ నేతలు
సిరిపురంలో నిరుపేద కుటుంబానికి అండగా గ్రామ నేతలు
March 03, 2026 12:07 PM
44 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబ పెద్ద నందిపాటి రామలింగం మరణంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి గ్రామ ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు తక్షణ సహాయం అందించారు.
గ్రామ సర్పంచ్ అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి రూ.10 వేల ఆర్థిక సహాయం అందించగా, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బండ శ్రీనివాస్ రెడ్డి 50 కిలోల బియ్యం ఇచ్చారు. 2వ వార్డు సభ్యులు గాదే శంకరయ్య రూ.2 వేల రూపాయలు, ఎంపీటీసీ పున్న వెంకటేశం రూ. 1000 రూపాయలు అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు కూనూరు ముత్తయ్య, అప్పం శ్రీరాములు, పోలెపాక కృష్ణ, గంజి శ్రీనివాస్, కూనూరు లింగస్వామి తదితరులు కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. గ్రామస్థులు కూడా సహాయం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి