శాంతినగర్ కాలనీలో రంగుల హోలీ సంబరాలు
శాంతినగర్ కాలనీలో రంగుల హోలీ సంబరాలు
K.RAVI
శాంతినగర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తొలి వేడుకలు విజయవంతం
- అధ్యక్షుడు పెద్దగోని రమేష్ గౌడ్
చౌటుప్పల్ పురపాలక కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో తొలిసారిగా 12వ వార్డు పరిధిలో ఏర్పాటైన శాంతినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోలీ పండుగను ఘనంగా నిర్వహించారు. కాలనీవాసుల సమిష్టి సహకారంతో జరిగిన ఈ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన పెద్దగొని రమేష్ గౌడ్ మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచిన కాలనీవాసులకు కృతజ్ఞతలు తెలిపారు. పాలకవర్గం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే హోలీ సంబరాలను ఐక్యంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. చిన్నారులు, పెద్దలు, యువతీ యువకులు నాచురల్ రంగులతో హోలీ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్లో డి.ఎస్.పి పటోళ్ల మధుసూదన్ రెడ్డి ని కలిసి అసోసియేషన్ తరపున హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బత్తుల శంకర్, తమ్మకొండ రాజు, కొక్కు శ్రీను, ప్రధాన కార్యదర్శి బొంగు పాండు, కోశాధికారి సురుగు రమేష్ గౌడ్, మంచి కంటి భాస్కర్ గుప్తా, ముద్దం సత్తయ్య గౌడ్, సుర్వి అంజయ్య, గోషిక బాలరాజు, ఎస్.కే. జానీ బాబు, బుంగపట్ల రవి, బుంగపట్ల భాస్కర్, కొక్కు వెంకన్న, కొక్కు శ్రీనివాస్, కట్కూరి సాయి కృష్ణ, ముక్కిడి వెక్కన్న, తమ్మకొండ శ్రీను, కనకమోని శ్రీను తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి