Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:49 PM

శాస్త్ర–సాంకేతిక రంగాల్లో భారత్ వేగవంతమైన పురోగతి సీవీ రామన్ జయంతి సందర్భంగా లిటిల్ బర్డ్స్ హై స్కూల్‌లో సైన్స్ ఫెయిర్

శాస్త్ర–సాంకేతిక రంగాల్లో భారత్ వేగవంతమైన పురోగతి సీవీ రామన్ జయంతి సందర్భంగా లిటిల్ బర్డ్స్ హై స్కూల్‌లో సైన్స్ ఫెయిర్

శాస్త్ర–సాంకేతిక రంగాల్లో భారత్ వేగవంతమైన పురోగతి సీవీ రామన్ జయంతి సందర్భంగా లిటిల్ బర్డ్స్ హై స్కూల్‌లో సైన్స్ ఫెయిర్
02-03-2026 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బీబీనగర్: శాస్త్ర, సాంకేతిక రంగాలలో భారతదేశం అగ్రదేశాలకు దీటుగా దూసుకుపోతుందని లిటిల్ బర్డ్స్ హై స్కూల్ కరస్పాండెంట్ మల్ల శ్రీనివాస్ అన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం లిటిల్ బర్డ్స్ హై స్కూల్‌లో సోమవారం సీవీ రామన్ జయంతిని పురస్కరించుకొని సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన శాస్త్రీయ నమూనాలు, ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి.

పాఠశాల విద్యార్థుల మేధోసంపత్తిని వెలికితీయాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వారు తమ సృజనాత్మకత, పరిశోధనా దృక్పథాన్ని ప్రదర్శించి అభినందనలు అందుకున్నారు. సైన్స్ ఫెయిర్ నిర్వహించడం పాఠశాలకు గర్వకారణమని నిర్వాహకులు తెలిపారు.

మానవ సమాజం కాలానుగుణంగా వివిధ రంగాలలో సాధిస్తున్న పురోగతి, ఆధునిక జీవన విధానంలో టెక్నాలజీ ప్రాధాన్యత ఈ ప్రదర్శన ద్వారా స్పష్టమైందన్నారు. శాస్త్ర విజ్ఞానం విద్యార్థుల్లో ఆలోచనా శక్తిని పెంపొందించి భవిష్యత్తుకు దారి చూపుతుందని పేర్కొన్నారు.

భారతదేశం శాస్త్ర, సాంకేతికత, రక్షణ రంగాలలో ప్రపంచస్థాయిలో తన సామర్థ్యాన్ని చాటుకుంటోందని, విద్యార్థులు అన్ని రంగాలపై అవగాహన పెంచుకుని నూతన ఆవిష్కరణలకు ముందుకు రావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

శాస్త్ర–సాంకేతిక రంగాల్లో భారత్ వేగవంతమైన పురోగతి సీవీ రామన్ జయంతి సందర్భంగా లిటిల్ బర్డ్స్ హై స్కూల్‌లో సైన్స్ ఫెయిర్

Article Image

బీబీనగర్: శాస్త్ర, సాంకేతిక రంగాలలో భారతదేశం అగ్రదేశాలకు దీటుగా దూసుకుపోతుందని లిటిల్ బర్డ్స్ హై స్కూల్ కరస్పాండెంట్ మల్ల శ్రీనివాస్ అన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం లిటిల్ బర్డ్స్ హై స్కూల్‌లో సోమవారం సీవీ రామన్ జయంతిని పురస్కరించుకొని సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన శాస్త్రీయ నమూనాలు, ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి.

పాఠశాల విద్యార్థుల మేధోసంపత్తిని వెలికితీయాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వారు తమ సృజనాత్మకత, పరిశోధనా దృక్పథాన్ని ప్రదర్శించి అభినందనలు అందుకున్నారు. సైన్స్ ఫెయిర్ నిర్వహించడం పాఠశాలకు గర్వకారణమని నిర్వాహకులు తెలిపారు.

మానవ సమాజం కాలానుగుణంగా వివిధ రంగాలలో సాధిస్తున్న పురోగతి, ఆధునిక జీవన విధానంలో టెక్నాలజీ ప్రాధాన్యత ఈ ప్రదర్శన ద్వారా స్పష్టమైందన్నారు. శాస్త్ర విజ్ఞానం విద్యార్థుల్లో ఆలోచనా శక్తిని పెంపొందించి భవిష్యత్తుకు దారి చూపుతుందని పేర్కొన్నారు.

భారతదేశం శాస్త్ర, సాంకేతికత, రక్షణ రంగాలలో ప్రపంచస్థాయిలో తన సామర్థ్యాన్ని చాటుకుంటోందని, విద్యార్థులు అన్ని రంగాలపై అవగాహన పెంచుకుని నూతన ఆవిష్కరణలకు ముందుకు రావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News