శాస్త్ర–సాంకేతిక రంగాల్లో భారత్ వేగవంతమైన పురోగతి సీవీ రామన్ జయంతి సందర్భంగా లిటిల్ బర్డ్స్ హై స్కూల్లో సైన్స్ ఫెయిర్
శాస్త్ర–సాంకేతిక రంగాల్లో భారత్ వేగవంతమైన పురోగతి సీవీ రామన్ జయంతి సందర్భంగా లిటిల్ బర్డ్స్ హై స్కూల్లో సైన్స్ ఫెయిర్
స్థానికం బృందం
బీబీనగర్: శాస్త్ర, సాంకేతిక రంగాలలో భారతదేశం అగ్రదేశాలకు దీటుగా దూసుకుపోతుందని లిటిల్ బర్డ్స్ హై స్కూల్ కరస్పాండెంట్ మల్ల శ్రీనివాస్ అన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం లిటిల్ బర్డ్స్ హై స్కూల్లో సోమవారం సీవీ రామన్ జయంతిని పురస్కరించుకొని సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన శాస్త్రీయ నమూనాలు, ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి.
పాఠశాల విద్యార్థుల మేధోసంపత్తిని వెలికితీయాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వారు తమ సృజనాత్మకత, పరిశోధనా దృక్పథాన్ని ప్రదర్శించి అభినందనలు అందుకున్నారు. సైన్స్ ఫెయిర్ నిర్వహించడం పాఠశాలకు గర్వకారణమని నిర్వాహకులు తెలిపారు.
మానవ సమాజం కాలానుగుణంగా వివిధ రంగాలలో సాధిస్తున్న పురోగతి, ఆధునిక జీవన విధానంలో టెక్నాలజీ ప్రాధాన్యత ఈ ప్రదర్శన ద్వారా స్పష్టమైందన్నారు. శాస్త్ర విజ్ఞానం విద్యార్థుల్లో ఆలోచనా శక్తిని పెంపొందించి భవిష్యత్తుకు దారి చూపుతుందని పేర్కొన్నారు.
భారతదేశం శాస్త్ర, సాంకేతికత, రక్షణ రంగాలలో ప్రపంచస్థాయిలో తన సామర్థ్యాన్ని చాటుకుంటోందని, విద్యార్థులు అన్ని రంగాలపై అవగాహన పెంచుకుని నూతన ఆవిష్కరణలకు ముందుకు రావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి