Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 02:12 PM

శ్రీ భోగేశ్వరాలయం నుంచి ఝరసంఘం వరకు శివ స్వాముల భక్తి పాదయాత్ర

శ్రీ భోగేశ్వరాలయం నుంచి ఝరసంఘం వరకు శివ స్వాముల భక్తి పాదయాత్ర

శ్రీ భోగేశ్వరాలయం నుంచి ఝరసంఘం వరకు శివ స్వాముల భక్తి పాదయాత్ర
February 14, 2026 09:39 AM 297 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం పరిధిలోని బోరంచ గ్రామంలోని ప్రాచీన శ్రీ భోగేశ్వరాలయం నుండి శనివారం రోజు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభమైంది. గ్రామానికి ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచిన ఈ ఆలయం వద్ద నుంచి సుమారు 20 మంది శివ మాలధారణ స్వాములు ఝరసంఘం పుణ్యక్షేత్రం దిశగా పాదయాత్రకు ఘనంగా బయలుదేరారు.ఈ సందర్భంగా శివ మాలధారణ స్వాములు మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా భక్తి భావంతో శివ మాలధారణను ధరించి నియమ నిష్టలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పరమశివుని ఆశీస్సులు పొందడం, సమాజంలో ఐక్యత, శాంతి, సత్సంప్రదాయాల పెంపొందింపునకు ఈ పాదయాత్రలు ఎంతో ఉపకరిస్తాయని వారు పేర్కొన్నారు.రెండు రోజుల పాటు కొనసాగే ఈ పాదయాత్రలో స్వాములు భజనలు, హరినామ స్మరణలతో భక్తి వాతావరణాన్ని నెలకొల్పనున్నారు. మార్గమధ్యంలో భక్తులు స్వాములను ఆహ్వానిస్తూ నీరు, పానీయాలు, ప్రసాదాలు అందిస్తూ తమ భక్తిశ్రద్ధలను చాటుతున్నారు.ఈ పుణ్యయాత్ర సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహ మోటార్స్ నారాయణఖేడ్ గుడిమె కృష్ణ ఆధ్వర్యంలో అల్పాహారం మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శివ స్వాములు తెలిపారు. భక్తులకు సేవ చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ పాదయాత్ర విజయవంతంగా కొనసాగాలని, శివుని కృప అందరిపై ఉండాలని భక్తులు ప్రార్థిస్తూ స్వాములను ఆశీర్వదించారు. గ్రామంలో ఆధ్యాత్మిక ఉత్సాహం వెల్లివిరిసింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News