Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వైసీపీ ‘హంతకుల ఫ్యాక్టరీ’ : మంత్రి సవిత ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 23, 2026 06:03 PM

శ్రీ భోగేశ్వరాలయం నుంచి ఝరసంఘం వరకు శివ స్వాముల భక్తి పాదయాత్ర

శ్రీ భోగేశ్వరాలయం నుంచి ఝరసంఘం వరకు శివ స్వాముల భక్తి పాదయాత్ర

శ్రీ భోగేశ్వరాలయం నుంచి ఝరసంఘం వరకు శివ స్వాముల భక్తి పాదయాత్ర
February 14, 2026 09:39 AM 290 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం పరిధిలోని బోరంచ గ్రామంలోని ప్రాచీన శ్రీ భోగేశ్వరాలయం నుండి శనివారం రోజు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభమైంది. గ్రామానికి ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచిన ఈ ఆలయం వద్ద నుంచి సుమారు 20 మంది శివ మాలధారణ స్వాములు ఝరసంఘం పుణ్యక్షేత్రం దిశగా పాదయాత్రకు ఘనంగా బయలుదేరారు.ఈ సందర్భంగా శివ మాలధారణ స్వాములు మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా భక్తి భావంతో శివ మాలధారణను ధరించి నియమ నిష్టలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పరమశివుని ఆశీస్సులు పొందడం, సమాజంలో ఐక్యత, శాంతి, సత్సంప్రదాయాల పెంపొందింపునకు ఈ పాదయాత్రలు ఎంతో ఉపకరిస్తాయని వారు పేర్కొన్నారు.రెండు రోజుల పాటు కొనసాగే ఈ పాదయాత్రలో స్వాములు భజనలు, హరినామ స్మరణలతో భక్తి వాతావరణాన్ని నెలకొల్పనున్నారు. మార్గమధ్యంలో భక్తులు స్వాములను ఆహ్వానిస్తూ నీరు, పానీయాలు, ప్రసాదాలు అందిస్తూ తమ భక్తిశ్రద్ధలను చాటుతున్నారు.ఈ పుణ్యయాత్ర సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహ మోటార్స్ నారాయణఖేడ్ గుడిమె కృష్ణ ఆధ్వర్యంలో అల్పాహారం మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శివ స్వాములు తెలిపారు. భక్తులకు సేవ చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ పాదయాత్ర విజయవంతంగా కొనసాగాలని, శివుని కృప అందరిపై ఉండాలని భక్తులు ప్రార్థిస్తూ స్వాములను ఆశీర్వదించారు. గ్రామంలో ఆధ్యాత్మిక ఉత్సాహం వెల్లివిరిసింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News